ఒంగోలులో దారుణం : మూగ మహిళపై ఐదుగురు కామాంధులు అత్యాచారం
జిల్లా కేంద్రమైన ఒంగోలులో దారుణం జరిగింది. ఓ మూగ మహిళపై ఐదుగురు కామాంధులు అత్యాచారానికి తెగబడ్డారు. ఈ దారుణ ఘటన శనివారం మధ్యాహ్నం జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
జిల్లా కేంద్రమైన ఒంగోలులో దారుణం జరిగింది. ఓ మూగ మహిళపై ఐదుగురు కామాంధులు అత్యాచారానికి తెగబడ్డారు. ఈ దారుణ ఘటన శనివారం మధ్యాహ్నం జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
ఒంగోలు నగరంలో సుమారు 35 ఏళ్ల వయస్సు కలిగిన మూగ యువతి, సాంబయ్య అనే రిక్షాకార్మికుడితో సహజీవనం చేస్తోంది. వారు దామచర్ల ఆంజనేయులు కాలనీలో నివాసం ఉంటున్నారు. ప్రతిరోజూ పాలకేంద్రం సమీపంలోని ఇళ్లలో పాచి పనులు చేసుకొని ఇంటికి తిరిగి వచ్చేది. ఈ నేపథ్యంలో శనివారం పారిశ్రామికవాడలో పనిచేసే ఐదుగురు యువకులు ఈ మూగ మహిళను ముళ్లపొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు.
ఇంటికి వచ్చి తన వద్ద బోరున ఏడ్చి అత్యాచారం చేసినట్లు ఆమె సైగతో చెప్పింది. దీంతో భర్త సాంబయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బాధితురాలు ఇరువురు నిందితులను గుర్తు పట్టడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అదేవిధంగా బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు రిమ్స్కు పంపించారు.