Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒంగోలులో దారుణం : మూగ మహిళపై ఐదుగురు కామాంధులు అత్యాచారం

జిల్లా కేంద్రమైన ఒంగోలులో దారుణం జరిగింది. ఓ మూగ మహిళపై ఐదుగురు కామాంధులు అత్యాచారానికి తెగబడ్డారు. ఈ దారుణ ఘటన శనివారం మధ్యాహ్నం జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...

Webdunia
ఆదివారం, 24 జులై 2016 (09:58 IST)
జిల్లా కేంద్రమైన ఒంగోలులో దారుణం జరిగింది. ఓ మూగ మహిళపై ఐదుగురు కామాంధులు అత్యాచారానికి తెగబడ్డారు. ఈ దారుణ ఘటన శనివారం మధ్యాహ్నం జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఒంగోలు నగరంలో సుమారు 35 ఏళ్ల వయస్సు కలిగిన మూగ యువతి, సాంబయ్య అనే రిక్షాకార్మికుడితో సహజీవనం చేస్తోంది. వారు దామచర్ల ఆంజనేయులు కాలనీలో నివాసం ఉంటున్నారు. ప్రతిరోజూ పాలకేంద్రం సమీపంలోని ఇళ్లలో పాచి పనులు చేసుకొని ఇంటికి తిరిగి వచ్చేది. ఈ నేపథ్యంలో శనివారం పారిశ్రామికవాడలో పనిచేసే ఐదుగురు యువకులు ఈ మూగ మహిళను ముళ్లపొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. 
 
ఇంటికి వచ్చి తన వద్ద బోరున ఏడ్చి అత్యాచారం చేసినట్లు ఆమె సైగతో చెప్పింది. దీంతో భర్త సాంబయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బాధితురాలు ఇరువురు నిందితులను గుర్తు పట్టడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అదేవిధంగా బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు రిమ్స్‌కు పంపించారు. 

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments