Webdunia - Bharat's app for daily news and videos

Install App

న్యాయవాద వృత్తికి క్రిమినల్ లాయర్ గుడ్‌బై...

ఏడు పదుల న్యాయవాద వృత్తికి ప్రముఖ క్రిమినల్ న్యాయవాది రాంజెఠ్మలానీ స్వస్తి చెప్పారు. మరో వారం రోజుల్లో 95వ ఏట అడుగుపెడుతున్న తరుణంలో ఈయన ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యం

Webdunia
సోమవారం, 11 సెప్టెంబరు 2017 (10:53 IST)
ఏడు పదుల న్యాయవాద వృత్తికి ప్రముఖ క్రిమినల్ న్యాయవాది రాంజెఠ్మలానీ స్వస్తి చెప్పారు. మరో వారం రోజుల్లో 95వ ఏట అడుగుపెడుతున్న తరుణంలో ఈయన ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా ఆయనను సన్మానించారు. 
 
ఈ సందర్భంగా రామ్‌జఠ్మలానీ తన పదవీ విరమణను ప్రకటించారు. ఈ వారం ప్రారంభంలో ఓ కేసు విచారణ సందర్భంగా ఇది తన చివరి కేసు అని, ఇకపై తాను ఎలాంటి కేసులు వాదించబోనని జఠ్మలానీ సుప్రీంకోర్టుకు తెలిపారు. జఠ్మలానీ ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడు.. ఆయన ఏడు దశాబ్దాలుగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నారు. ప్రముఖమైన కేసులు ఎన్నింటినో వాదించారు. 
 
సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్‌లో అత్యధిక ఫీజు తీసుకునే న్యాయవాది. న్యాయవాద వృత్తి నుంచి తప్పుకుంటున్నా.. ప్రజాజీవితం నుంచి బయటకు వెళ్లడంలేదని ఆయన ప్రకటించారు. నేను జీవించి ఉన్నంతకాలం రాజకీయాల్లో అవినీతిపై పోరాడుతాను. భారతదేశాన్ని శక్తిమంతమైన, మంచి స్వరూపంలోకి తీసుకొని వస్తానని నమ్ముతున్నాను అని జఠ్మలానీ పేర్కొన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ హీరో కళ్లలో గమ్మత్తైన ఆకర్షణ ఉంది : షాలిని పాండే

సిలికాన్‌లో ఏఐ రీసెర్చ్ సెంటర్‌ లో సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిసిన కమల్ హాసన్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments