Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాజ్‌నాథ్ సింగ్? నేడు అమిత్ షా కీలక ప్రకటన

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నియమితులు కానున్నారు. ఇదే అశంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గురువారం కీలక ప్రకటన చేయనున్నారు. ఇటీవల వెల్లడైన ఉత్తరప్రదేశ్ రాష్

Webdunia
గురువారం, 16 మార్చి 2017 (11:15 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నియమితులు కానున్నారు. ఇదే అశంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గురువారం కీలక ప్రకటన చేయనున్నారు. ఇటీవల వెల్లడైన ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 325 సీట్లను గెలుచుకుని ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే. 
 
అయితే, యూపీ సీఎం పీఠం కోసం బీజేపీ ఎంపీ ఆదిత్యానాథ్‌, రైల్వే శాఖ సహాయ మంత్రి మనోజ్‌ సిన్హా, లఖ్‌నవ్‌ మేయర్‌ దినేశ్‌ శర్మ, యూపీ శాఖ అధ్యక్షుడు కేశవ ప్రసాద్‌ మౌర్య, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోశ్‌ గాంగ్వార్‌, రాష్ట్ర బీజేపీ సీనియర్‌ నేత స్వతంతర్‌దేవ్‌, మహరాజ్‌పూర్‌ నుంచి 7 సార్లు అసెంబ్లీకి ఎన్నికైన సతీశ్‌ మహానా పేర్లు కూడా పోటీలో ఉన్నాయి. 
 
ఇందరిపేర్లూ జాబితాలో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రిగా రాజ్‌నాథ్‌కే పట్టం కడతారని బీజేపీ వర్గాల సమాచారం. బుధవారం లఖ్‌నవ్‌లోని సీఎం అధికార నివాసంలో కేంద్ర హోంశాఖ అధికారులు రెక్కీ నిర్వహించడం ఈ వాదనని బలపరుస్తోంది. ఒక పర్యాయం యూపీ సీఎంగా పని చేసిన అనుభవంతోపాటు, రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలకు దోహదం చేసిన నేపథ్యం, యూపీ ప్రజల నాడి తెలిసి ఉండటం, అన్నివర్గాలతో రాజ్‌నాథ్‌కు సత్సంబంధాలు ఉండటం వంటి అంశాలను అధిష్టానం పరిగణనలోకి తీసుకొన్నట్టు తెలుస్తోంది. 
 
అయితే, ఈ వార్తల్లో నిజం లేదని రాజ్‌నాథ్‌ కొట్టిపడేశారు. తాను సీఎం రేసులో ఉన్నాననడంలో అర్థమే లేదని ఒక మీడియాకు ఇచ్చిన సమాధానంలో అన్నారు. యూపీ సీఎంని ఎంపిక చేసే బాధ్యతని బీజేపీ పార్లమెంటరీ బోర్డు.. అమిత్‌షాకు అప్పగించగా, ఆయన గురువారం కీలక నిర్ణయాన్ని వెలువరించనున్నారు. ఆ మరునాడే కొత్త సీఎం పీఠం ఎక్కుతారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments