Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెలికాఫ్టర్ ప్రమాదంపై విచారణ సాగుతోంది : రాజ్‌నాథ్ సింగ్

Webdunia
గురువారం, 9 డిశెంబరు 2021 (11:42 IST)
తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లా కాట్టేరిలో కూలిపోయిన హెలికాఫ్టర్ ప్రమాదంపై పూర్తిస్థాయిలో విచారణ సాగుతోందని కేంద్ర రక్షణ శాఖామంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన గురువారం లోక్‌సభలో ఒక పత్రికా ప్రకటన చేశారు. 
 
ఈ హెలికాఫ్టర్ ప్రమాదంలో మొత్తం 13 మంది చనిపోయారని చెప్పారు. వీరిలో భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్, ఆయన భార్య మథులిక రావత్ సహా 11 మంది ఉన్నారని చెప్పారు. 
 
ప్రమాదానికి గురైన హెలికాఫ్టర్ సులూరు ఎయిర్ బేస్ నుంచి బుధవారం ఉదయం 11.48 గంటలకు టేకాఫ్ అయిందన్నారు. మధ్యాహ్నం 12.15 గంటలకు వెల్లింగ్టన్‌లోని ఆర్మీ ట్రైనింగ్ సెంటరులో ల్యాండింగ్ కావాల్సివుందన్నారు. 
 
కానీ, మధ్యాహ్నం 12.08 గంటల సమయంలో ఈ హెలికాఫ్టర్‌కు సులూరు ఎయిర్‌బేస్‌తో సంబంధాలు తెగిపోయాయని రాజ్‌నాథ్ సింగ్ తన ప్రకటనలో పేర్కొన్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికే హెలికాఫ్టర్ కూలిపోయిందని చెప్పారు. 
 
ఈ ప్రమాదం తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు. హెలికాఫ్టర్ పెద్ద శబ్దంతో కూలిపోవడాన్ని స్థానికులు గుర్తించి, ప్రమాదస్థలికి పరుగులు తీశారని చెప్పారు. ఈ హెలికాఫ్టర్ ప్రమాదంపై పూర్తి స్థాయిలో విచారణ మొదలైందని చెప్పారు 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాలంతోపాటు రజనీకాంత్, మోహన్ బాబు స్నేహం పరుగెడుతుంది

నైజాంలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా సూర్య మూవీ కంగువ

మిడిల్ క్లాస్ కష్టాలు, ఎమోషన్స్ తో సారంగదరియా’ ట్రైలర్ - ఆవిష్కరించిన హీరో నిఖిల్

జియో సినిమా ప్రీమియంలో ఈనెల‌ 15న కుంగ్ ఫూ పాండా 4

డ్రగ్స్ - సైబర్ నేరాల అరికట్టేందుకు ప్రయత్నం : నిర్మాత దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments