Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిరాడంబరత - సత్‌ప్రవర్తనకు ప్రతిరూపం ప్రణబ్ : రాజ్‌నాథ్ సింగ్

Webdunia
సోమవారం, 31 ఆగస్టు 2020 (18:24 IST)
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇకలేరు. ఆయన సోమవారం సాయంత్రం కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చేరిన ఆయనకు కరోనా వైరస్ సోకింది. ఆ తర్వాత మెదడుకు సర్జరీ జరిగింది. ఈ సర్జరీ నుంచి ఆయన కోలుకోలేక డీప్ కోమాలోకి వెళ్లిపోయారు. అయితే, ఆయన ప్రాణాలు కాపాడేందుకు ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రి వైద్య బృందం చేయని ప్రయత్నమంటూ లేదు. ఈ క్రమంలో సోమవారం ఆయన తుదిశ్వాస విడిచినట్టు ప్రణబ్ తనయుడు అభిజిత్ ముఖర్జీ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.
 
ఇదిలావుండగా, ప్రణబ్ మృతి పట్ల కేంద్ర రక్షణ శాఖామంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. అనేక దశాబ్దాలపాటు భారత దేశానికి విశేష సేవలందించిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నిరాడంబరత, నిజాయితీలకు ప్రతిరూపమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు.
 
ప్రణబ్ ముఖర్జీ దివంగతులు కావడం పట్ల రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. నిరాడంబరత, నిజాయితీ, సత్ప్రవర్తనలకు ప్రతిరూపం ప్రణబ్ ముఖర్జీ అని పేర్కొన్నారు. ఆయన మన దేశానికి అంకితభావంతో, శ్రద్ధాసక్తులతో సేవ చేశారన్నారు. ఆయన ప్రజా జీవితంలో చేసిన సేవలు, కృషి అమూల్యమైనవని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara Veeramallu Review: హరిహర వీరమల్లు మూవీలో హిందూధర్మం వుందా? మూవీ రివ్యూ

Rajeev Kanakala: రాజీవ్ కనకాలకు నోటీసులు జారీ.. ఆరోగ్యం బాగోలేదు

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments