Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌ను ఏకేసిన రాజ్‌నాథ్: జాతీయ రహదారుల్లో సీసీ కెమెరాలు!

Webdunia
శనివారం, 29 నవంబరు 2014 (12:20 IST)
పాకిస్థాన్‌ను కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఏకిపారేశారు. దేశ రక్షణలో పోలీసు, నిఘా వ్యవస్థల పాత్ర చాలా కీలకమని రాజ్ నాథ్ సింగ్ అన్నారు. అల్ ఖైదా, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదం ఒక సవాలు వంటివని చెప్పారు. 
 
ఇటీవల జరిగిన జమ్ము కాశ్మీర్ ఎన్నికల్లో ఎక్కువ శాతం పోలింగ్ నమోదయిందన్న రాజ్ నాథ్, ఇంత ఎక్కువ శాతం పోలింగ్ ఎన్నడూ జరగలేదని వివరించారు.
 
ఇక ఉగ్రవాదం చాలా తీవ్రమైన అంశమని, దానిని చిన్నదిగా చూడబోమని రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల డీజీపీలతో గౌహతిలో రెండు రోజుల పాటు జరగనున్న సమావేశానికి శనివారం ఉదయం రాజ్ నాథ్ హాజరయ్యారు. ఉగ్రవాదం, విదేశీ చొరబాట్లు, శరణార్థుల అంశాలపై ఆయన చర్చిస్తున్నారు. 
 
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సరిహద్దులో పాక్ దురాగతాలకు పాల్పడుతోందని, సరిహద్దు ప్రజలకు పూర్తి భద్రత కల్పిస్తామని తెలిపారు. 2019 నాటికి అన్ని జాతీయ రహదారుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. 

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

Show comments