Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లిని టెర్రస్ పైనుంచి కిందకు తోసి చంపిన 'ప్రొఫెసర్' కొడుకు (వీడియో)

Webdunia
శుక్రవారం, 5 జనవరి 2018 (11:13 IST)
నవమాసాలు పెంచిపోషించిన తల్లి అనారోగ్యానికిగురై మంచానపడటంతో ఆమెకు సేవ చేయలేక విసిగిపోయిన ప్రొఫెసర్ కుమారుడు... మేడపై నుంచి కిందికి తోసేసి చంపేశాడు. ఆరోగ్యం కోసం ఎండలో కూర్చోబెడ‌తాన‌ని త‌న త‌ల్లిని అపార్ట్‌మెంట్‌పైకి తీసుకెళ్లిన ఆ కొడుకు అక్క‌డి నుంచి ఆమెను కిందకు తోసేసి హ‌త్య చేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తంకావడంతో చివ‌ర‌కు అడ్డంగా దొరికిపోయాడు. ఈ దారుణం రాజ్‌కోట్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గుజరాత్‌ రాష్ట్రంలోని రాజ్‌కోట్‌లోని గాంధీగ్రామ్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లో సందీప్ అనే వ్యక్తి ప్రొఫెసర్‌గా పని చేస్తున్నాడు. ఈయన తల్లి జై శ్రీబెన్. వృద్దాప్యంతో పాటు.. అనారోగ్యంతో బాధ‌ప‌డుతోంది. ఈమె మూడు నెల‌ల క్రితం అపార్ట్‌మెంట్‌పై నుంచి ప‌డి మృతి చెందింది. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకుంద‌ని భావించిన పోలీసులు ఈ కేసును క్లోజ్ చేశారు. 
 
అయితే, ఓ గుర్తు తెలియ‌ని వ్య‌క్తి తాజాగా రాజ్‌కోట్ పోలీసులకు ఓ లేఖ రాసి, సీసీటీవీ ఫుటేజీని కూడా అందించాడు. దీంతో ఈ కేసులో మ‌ళ్లీ ద‌ర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సందీప్‌ను అరెస్టు చేశారు. పోలీసుల‌ విచార‌ణ‌లో మొద‌ట అస‌త్యాలు చెప్పిన‌ సందీప్ ఆ తర్వాత తమదైనశైలిలో విచారించడంతో చేసిన నేరాన్ని అంగీకరించాడు. తన తల్లికి ఆరోగ్యం బాగో లేక‌పోవ‌డంతో ఆమెను ఆసుప‌త్రుల చుట్టూ తిప్ప‌లేక‌ విసిగిపోయాన‌ని, అందుకే హ‌త్య చేశాన‌ని చెప్పాడు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు త‌దుపరి విచార‌ణ‌ను కొన‌సాగిస్తున్నారు. 
 
 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments