Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీ - రాజ్‌నాథ్‌ల ప్రచ్ఛన్న యుద్ధం... అందుకే రాజీవ్ మెహ్రిషీ నియామకం!

Webdunia
బుధవారం, 2 సెప్టెంబరు 2015 (10:56 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతుందా? అందుకే హోంశాఖ కార్యదర్శిగా రాజీవ్ మెహ్రిషీని రాజ్‌నాథ్‌కు మాటమాత్రం చెప్పకుండా మోడీ నియమించినట్టు వార్తలు వస్తున్నాయి. రాజస్థాన్‌లో వసుంధరా రాజే ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్న రాజీవ్, సంస్కరణల అమలులో ముందు నిలిచి మోడీ కోటరీలోకి చేరిపోయారు. 
 
1978 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఈయనను గత సంవత్సరం అక్టోబరులో ఆర్థిక వ్యవహారాల విభాగానికి మోడీ తీసుకొచ్చారు. అరుణ్ జైట్లీకి కుడి భుజంగా నిలిపారు. ఆ శాఖలో సైతం రాజీవ్ తీసుకున్న నిర్ణయాలు దేశ ఆర్థిక వృద్ధికి ఎంతగానో ఉపయోగపడ్డాయి. దీంతో హోం శాఖలోకి, అందునా రాజ్‌నాథ్‌కు ఇష్టం లేకుండానే రాజీవ్ ప్రవేశించడం, మంత్రిత్వ శాఖలో అస్థిరతకు దారితీయవచ్చని కొందరు అధికారులు వ్యాఖ్యానించారు. 
 
నిజానికి తనకు నమ్మకమైన వ్యక్తిని హోంశాఖ కార్యదర్శిగా నియమించుకోవాలని రాజ్‌నాథ్ గట్టిగా భావించారు. అయితే, చివరకు తనకు తెలియకుండానే కార్యదర్శిగా రాజీవ్‌ నియామకం జరిగిపోవడాన్ని ఆయన జీర్ణించుకోలేక పోతున్నారు. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

Show comments