Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్కంఠకు తెరదింపిన రజినీకాంత్ - 30న కీలక భేటీ

Webdunia
ఆదివారం, 29 నవంబరు 2020 (13:57 IST)
తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీకి వచ్చే యేడాది మే నెలలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ సొంతంగా పోటీ చేస్తారా? లేకా బీజేపీకి మద్దతిస్తారా అనే అంశంపై గత కొన్ని రోజులుగా ఉత్కంఠ నెలకొంది. దీనికి తెరదించేలా రజినీకాంత్ కీలక ప్రకటన చేశారు. 
 
త‌న అభిమాన సంఘానికి చెందిన అధ్యక్షుల‌ందరూ న‌వంబ‌ర్ 30న చెన్నైకు రావాలని రజనీకాంత్ పిలుపునిచ్చారు. సోమవారం ఉద‌యం 9 గంట‌ల‌కు వారితో సమావేశంలో మాట్లాడనున్నారు. అయితే, ఈ సమావేశం ఎందుకు పెడుతున్నార‌న్న విషయాన్ని మాత్రం ఆయన ప్రకటించలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై ఆయన కీలక చర్చలు జరుపుతారని ప్రచారం జరుగుతోంది. 
 
కాగా, ఈ అసెంబ్లీ ఎన్నికల కోసం అన్ని రాజకీయ పార్టీల నేతలు ఇప్పటి నుంచే ప్రణాళికలు రచించుకుంటున్నాయి. ఈ విషయంలో ఎంకే స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే ఒక అడుగు ముందుంది. అదేసమయంలో తన మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీని పక్కనపెట్టాలని డీఎంకే భావిస్తోంది. అలాగే, అధికార అన్నాడీఎంకే కూడా తనదైనశైలిలో వ్యూహాలు రచించుకుంటూ ముందుకుసాగుతోంది. ఈ ఎన్నికల కోసం బీజేపీతో అన్నాడీఎంకే చేతులు కలిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharva: శర్వా, సంయుక్త పై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్

నెలకు 67 రూపాయల ప్యాక్ తో ఖర్చు తక్కువ కిక్ ఎక్కువ అంటున్న ఆహా ఓటీటీ

Balayya: ఎనిమిది నెలలు నిద్రాహారాలు మాని కృషి చేసి సినిమాని రీస్టోర్ చేశారు : బాలకృష్ణ

Kadambari: వ‌దిలేసిన నిస్సాహ‌యుల‌ను మేం చేరదీస్తాం : మనం సైతం కాదంబరి

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments