Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్కంఠకు తెరదింపిన రజినీకాంత్ - 30న కీలక భేటీ

Webdunia
ఆదివారం, 29 నవంబరు 2020 (13:57 IST)
తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీకి వచ్చే యేడాది మే నెలలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ సొంతంగా పోటీ చేస్తారా? లేకా బీజేపీకి మద్దతిస్తారా అనే అంశంపై గత కొన్ని రోజులుగా ఉత్కంఠ నెలకొంది. దీనికి తెరదించేలా రజినీకాంత్ కీలక ప్రకటన చేశారు. 
 
త‌న అభిమాన సంఘానికి చెందిన అధ్యక్షుల‌ందరూ న‌వంబ‌ర్ 30న చెన్నైకు రావాలని రజనీకాంత్ పిలుపునిచ్చారు. సోమవారం ఉద‌యం 9 గంట‌ల‌కు వారితో సమావేశంలో మాట్లాడనున్నారు. అయితే, ఈ సమావేశం ఎందుకు పెడుతున్నార‌న్న విషయాన్ని మాత్రం ఆయన ప్రకటించలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై ఆయన కీలక చర్చలు జరుపుతారని ప్రచారం జరుగుతోంది. 
 
కాగా, ఈ అసెంబ్లీ ఎన్నికల కోసం అన్ని రాజకీయ పార్టీల నేతలు ఇప్పటి నుంచే ప్రణాళికలు రచించుకుంటున్నాయి. ఈ విషయంలో ఎంకే స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే ఒక అడుగు ముందుంది. అదేసమయంలో తన మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీని పక్కనపెట్టాలని డీఎంకే భావిస్తోంది. అలాగే, అధికార అన్నాడీఎంకే కూడా తనదైనశైలిలో వ్యూహాలు రచించుకుంటూ ముందుకుసాగుతోంది. ఈ ఎన్నికల కోసం బీజేపీతో అన్నాడీఎంకే చేతులు కలిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

Bobby Kolli: డైరెక్టర్ బాబీ కొల్లి KVN ప్రొడక్షన్స్‌తో సినిమా ప్రకటన

దేవరకొండ కోసం నల్లగండ్ల అపర్ణా సినిమాస్‌లో రాజమౌళి ప్రత్యక్షం

Raviteja: రవితేజ మాస్ జాతర విడుదల ఆలస్యమవుతుందా?

మొదటి రోజు గ్రాస్ కలెక్షన్స్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్ రికార్డ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments