Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్కంఠకు తెరదింపిన రజినీకాంత్ - 30న కీలక భేటీ

Webdunia
ఆదివారం, 29 నవంబరు 2020 (13:57 IST)
తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీకి వచ్చే యేడాది మే నెలలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ సొంతంగా పోటీ చేస్తారా? లేకా బీజేపీకి మద్దతిస్తారా అనే అంశంపై గత కొన్ని రోజులుగా ఉత్కంఠ నెలకొంది. దీనికి తెరదించేలా రజినీకాంత్ కీలక ప్రకటన చేశారు. 
 
త‌న అభిమాన సంఘానికి చెందిన అధ్యక్షుల‌ందరూ న‌వంబ‌ర్ 30న చెన్నైకు రావాలని రజనీకాంత్ పిలుపునిచ్చారు. సోమవారం ఉద‌యం 9 గంట‌ల‌కు వారితో సమావేశంలో మాట్లాడనున్నారు. అయితే, ఈ సమావేశం ఎందుకు పెడుతున్నార‌న్న విషయాన్ని మాత్రం ఆయన ప్రకటించలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై ఆయన కీలక చర్చలు జరుపుతారని ప్రచారం జరుగుతోంది. 
 
కాగా, ఈ అసెంబ్లీ ఎన్నికల కోసం అన్ని రాజకీయ పార్టీల నేతలు ఇప్పటి నుంచే ప్రణాళికలు రచించుకుంటున్నాయి. ఈ విషయంలో ఎంకే స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే ఒక అడుగు ముందుంది. అదేసమయంలో తన మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీని పక్కనపెట్టాలని డీఎంకే భావిస్తోంది. అలాగే, అధికార అన్నాడీఎంకే కూడా తనదైనశైలిలో వ్యూహాలు రచించుకుంటూ ముందుకుసాగుతోంది. ఈ ఎన్నికల కోసం బీజేపీతో అన్నాడీఎంకే చేతులు కలిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

అందరి బుర్రలు ఒకేలా ఆలోచించవు కదా : సురేఖా వాణి

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments