Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాట రజనీకాంత్ కింగ్ మేకర్: ఏపీలో టీడీపీకి గడ్డుకాలం.. వైకాపా?

సూపర్ స్టార్ రజనీకాంత్ పేరు పెట్టని పార్టీ.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 23 ఎంపీ స్థానాలు గెలుచుకుంటుందని తాజా సర్వేలో తేలింది. ఫలితంగా తమిళనాట రజనీకాంత్ కింగ్ మేకర్ అవుతారని సర్వే తేల్చింది.

Webdunia
శనివారం, 20 జనవరి 2018 (13:45 IST)
సూపర్ స్టార్ రజనీకాంత్ పేరు పెట్టని పార్టీ.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 23 ఎంపీ స్థానాలు గెలుచుకుంటుందని తాజా సర్వేలో తేలింది. ఫలితంగా తమిళనాట రజనీకాంత్ కింగ్ మేకర్ అవుతారని సర్వే తేల్చింది.

రిపబ్లిక్ టీవీ, సీ ఓటర్ సంస్థలు తాజాగా నిర్వహించిన సర్వేలో... రజనీకాంత్ పార్టీ ప్రకటించి ఎన్నికల బరిలోకి దిగితే తమిళనాట మిగిలిన పార్టీలకు గట్టిపోటీని ఇస్తారని తేలింది. అలాగే దేశ రాజకీయాలపై కూడా రజనీకాంత్ ప్రభావం చూపుతారని రిపబ్లిక్, సీ ఓటర్ సంస్థలు వెల్లడించాయి. 
 
ఇందులో భాగంగా తమిళ రాష్ట్రంలోని 39 స్థానాల్లో 28.3శాతం ఓట్లతో 14 స్థానాలు డీఎంకే కైవసం చేసుకుంటుందని.. 13.6 శాతం ఓట్లతో అన్నాడీఎంకే కేవలం రెండే స్థానాలు దక్కించుకుంటుందని తెలిపింది. కానీ సూపర్ స్టార్ రజనీ కాంత్ 33.7 శాతం ఓట్లతో 23 స్థానాలను గెలుచుకుని, బలమైన పార్టీగా నిలుస్తుందని సర్వేలు తేల్చాయి. కానీ, కాంగ్రెస్‌, బీజేపీలు కనీసం ఖాతా కూడా తెరవవని సీ ఓటర్ సంస్థలు నిర్వహించిన సర్వేలో తేలింది. 
 
ఇక దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందని సర్వేలు తేల్చాయి. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ 89 చోట్ల విజయం సాధించనుందని తెలిసింది. గత ఏడాది చివరి వారంలో ఈ సర్వేను నిర్వహించారు.

అయితే ఆంధ్రప్రదేశ్‌లో అధికార టీడీపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని సర్వే తేల్చింది. ఏపీలోని 25 ఏంపీ స్థానాల్లో వైసీపీ 13 స్థానాల్లో విజయం సాధించనుంది. టిడిపి 12 స్థానాల్లో విజయం సాధించనున్నట్టు ఈ సర్వే వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments