Webdunia - Bharat's app for daily news and videos

Install App

'రా' చీఫ్‌గా రాజీందర్ ఖన్నా.. సీఆర్పీఎఫ్‌ డీజీగా ప్రకాశ్ మిశ్రా!

Webdunia
ఆదివారం, 21 డిశెంబరు 2014 (13:25 IST)
భారత గూఢచర్య సంస్థ ‘రీసర్చి అండ్ అనాలసిస్ వింగ్’ (‘రా’) అధిపతిగా రాజీందర్ ఖన్నా, సీఆర్పీఎఫ్ డీజీగా సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రకాశ్ మిశ్రాలు నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. 
 
రా చీఫ్‌గా నియమితులైన రాజీందర్ ఖన్నా... రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఆర్ఏఎస్)కు చెందిన 1978 బ్యాచ్ అధికారి. ఈయన రెండేళ్ల పాటు 'రా' చీఫ్‌గా కొనసాగనున్నారు. అలాగే, సీఆర్పీఎఫ్ డీజీ బాధ్యతలు చేపట్టనున్న ప్రకాశ్ మిశ్రా, 1977 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన సీనియర్ పోలీసు అధికారి. 
 
ఈయన గతంలో ఒడిశా రాష్ట్ర డీజీపీగా పనిచేసిన సమయంలో మావోయిస్టులపై ఉక్కుపాదం మోపారు. తాజాగా మావోల అణచివేతలో కీలక భూమిక పోషించాలన్న ఉద్దేశ్యంతో ఆయనను సీఆర్పీఎఫ్‌ చీఫ్‌గా ఎంపికయ్యారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments