Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెట్లు నరకడాన్ని అడ్డుకున్నదనీ పెట్రోల్ పోసి నిప్పంటించారు.. ఎక్కడ?

భూతాపాన్ని తగ్గించేందుకు ఇంటికో మొక్కను నాటాలని ప్రభుత్వాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. కానీ, కొందరు గ్రామస్థులు తమతమ ప్రాంతాల్లో ఉన్న చెట్లను నిలువునా నరికివేస్తున్నారు. పైగా చెట్ల నరకివేతను అడ్

Webdunia
సోమవారం, 27 మార్చి 2017 (14:26 IST)
భూతాపాన్ని తగ్గించేందుకు ఇంటికో మొక్కను నాటాలని ప్రభుత్వాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. కానీ, కొందరు గ్రామస్థులు తమతమ ప్రాంతాల్లో ఉన్న చెట్లను నిలువునా నరికివేస్తున్నారు. పైగా చెట్ల నరకివేతను అడ్డుకున్నా లేక ప్రశ్నించినా వారిపై భౌతిక దాడులకు దిగుతున్నారు. తాజాగా ఓ మహిళ చెట్ల నరికివేతను అడ్డుకోవడంతో ఆగ్రహించిన గ్రామస్థులంతా కలిసి ఆమెను సజీవదహనం చేశారు. 
 
ఈ దారుణం రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... జోధ్‌పూర్‌లోని ఓ గ్రామంలో ఆదివారం రోడ్డు నిర్మాణ పనులు చేస్తుండగా.. లలిత అనే మహిళకు చెందిన పొలంలో చెట్లు అడ్డుగా వచ్చాయి. వాటిని తొలగిస్తామని చెప్పగా.. లలిత అందుకు నిరాకరించింది. చెట్ల నరికివేతకు లలిత ఒప్పుకోకపోవడంతో ఆగ్రహానికి గురైన గ్రామస్థులు ఆమెపై దాడి చేశారు. 
 
అంతటితో ఆగకుండా.. ఆమెపై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన లలిత.. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మరణించింది. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. నిందితుల్లో గ్రామ సర్పంచ్‌ రణ్‌వీర్‌ సింగ్‌‌తో పాటు.. 10 మంది ఉన్నారు. వీరందరిపై కేసు నమోదు చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఉస్తాద్ భగత్ సింగ్'లో రాశీఖన్నా... మేకర్స్ వెల్లడి

NTR: వార్ 2తో హృతిక్ రోషన్ తారక్ (ఎన్.టి.ఆర్.) 25 ఏళ్ళ వారసత్వం

Raashi Khanna: ఉస్తాద్‌ భగత్‌సింగ్ లో దేవదూత రాశిఖన్నా శ్లోకా గా ఎంట్రీ

పవన్ కళ్యాణ్ నిత్యం మండే స్ఫూర్తి : క్రిష్ జాగర్లమూడి

Bigg Boss 9 Telugu: సెట్లు సిద్ధం.. వీజే సన్నీ, మానస్, ప్రియాంక జైన్‌లు రీ ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments