Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పు తీర్చలేదని కేసు.. కలెక్టరేట్‌లో రైతు ఆత్మహత్య

Webdunia
బుధవారం, 22 మే 2019 (14:46 IST)
మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పు తీర్చలేక పోవడంతో బ్యాంకు అధికారులు కేసు పెట్టారు. దీంతో అవమానభారంతో కుంగిపోయిన ఆ రైతు చెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని హనుమాన్‌గఢ్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హనుమాన్‌గఢ్‌కు చెందిన సురజరామ్(52) అనే రైతు స్థానికంగా ఉండే ఓ ప్రైవేటు బ్యాంకులో రూ.6.5 లక్షల రుణం తీసుకున్నాడు. ఈ అప్పుతో పంట వేసినప్పటికీ గిట్టుబాటు కాలేదు. మరోవైపు రెండేళ్లలో ఈ అప్పును తీర్చలేకపోవడంతో అసలు, వడ్డీ కలిపి రూ.9 లక్షలకు చేరుకుంది. ఈ అప్పును తిరిగి చెల్లించలేక పోయాడు.
 
దీంతో అప్పు చెల్లించాలని బ్యాంకు అధికారులు పలుమార్లు నోటీసులు పంపించినప్పటికీ రైతు నుంచి స్పందనలేదు. దీంతో బ్యాంకు అధికారులు పోలీస్ స్టేషనులో కేసు పెట్టారు. ఫలితంగా పోలీసులు ఆ రైతును అరెస్టు చేశారు. 
 
ఆ తర్వాత బెయిలుపై విడుదలైన సురజరామ్.. అవమానభారంతో కుంగిపోయి సోమవారం రాత్రి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట చెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. ఈ ఘటన నేపథ్యంలో కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiranjeevi: చెన్నైవెళుతున్న చిరంజీవి, వెంకటేష్

Vennela Kishore: వెన్నెల కిషోర్ పాడిన అనుకుందొకటిలే.. లిరికల్ సాంగ్

Omkar: ఓంకార్ సారధ్యంలో రాజు గారి గది 4 శ్రీచక్రం ప్రకటన

Rakshit Atluri: అశ్లీలతకు తావు లేకుండా శశివదనే సినిమాను చేశాం: రక్షిత్ అట్లూరి

Rashmika: ప్రేమికులుగా మనం ఎంతవరకు కరెక్ట్ ? అంటున్న రశ్మిక మందన్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

తర్వాతి కథనం
Show comments