Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పు తీర్చలేదని కేసు.. కలెక్టరేట్‌లో రైతు ఆత్మహత్య

Webdunia
బుధవారం, 22 మే 2019 (14:46 IST)
మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పు తీర్చలేక పోవడంతో బ్యాంకు అధికారులు కేసు పెట్టారు. దీంతో అవమానభారంతో కుంగిపోయిన ఆ రైతు చెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని హనుమాన్‌గఢ్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హనుమాన్‌గఢ్‌కు చెందిన సురజరామ్(52) అనే రైతు స్థానికంగా ఉండే ఓ ప్రైవేటు బ్యాంకులో రూ.6.5 లక్షల రుణం తీసుకున్నాడు. ఈ అప్పుతో పంట వేసినప్పటికీ గిట్టుబాటు కాలేదు. మరోవైపు రెండేళ్లలో ఈ అప్పును తీర్చలేకపోవడంతో అసలు, వడ్డీ కలిపి రూ.9 లక్షలకు చేరుకుంది. ఈ అప్పును తిరిగి చెల్లించలేక పోయాడు.
 
దీంతో అప్పు చెల్లించాలని బ్యాంకు అధికారులు పలుమార్లు నోటీసులు పంపించినప్పటికీ రైతు నుంచి స్పందనలేదు. దీంతో బ్యాంకు అధికారులు పోలీస్ స్టేషనులో కేసు పెట్టారు. ఫలితంగా పోలీసులు ఆ రైతును అరెస్టు చేశారు. 
 
ఆ తర్వాత బెయిలుపై విడుదలైన సురజరామ్.. అవమానభారంతో కుంగిపోయి సోమవారం రాత్రి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట చెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. ఈ ఘటన నేపథ్యంలో కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments