Webdunia - Bharat's app for daily news and videos

Install App

13 ఏళ్ల బాలికను రూ.7లక్షలకు అమ్మేసిన కసాయి తండ్రి.. 4 నెలల గర్భంతో?

Webdunia
బుధవారం, 13 నవంబరు 2019 (12:03 IST)
కన్నబిడ్డనే ఓ కసాయి తండ్రి అమ్మేశాడు. 13 ఏళ్ల బాలికను డబ్బుల కోసం ఓ తండ్రి అమ్మేశాడు. ఈ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌కు చెందిన ఓ తండ్రి 13 ఏళ్ల కుమార్తెను ఏడు లక్షల రూపాయలకు అమ్మేశాడు. కానీ ఆ చిన్నారిని హైదరాబాదులో పోలీసులు కనుగొన్నారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని వారిపై కిడ్నాప్ కేసును నమోదు చేశారు. 
 
బాలిక కనిపించడం లేదని ఈ ఏడాది జూన్‌లో తల్లి నుంచి పోలీసులకు ఫిర్యాదు అందింది. విచారణ చేయగా తండ్రే దోషి అని తేలడంతో ఆయనకు సహకరించిన మరో ఇద్దరిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఇక బాలిక ఎక్కడుందో కనుగొనే ప్రయత్నం చేసిన పోలీసులు చివరకు గెలిచారు. అలాగే బాలిక హైదరాబాదులో ఉన్నట్లు కనుగొన్నామని పోలీసులు చెప్పారు. 
 
చిన్నారిని బామర్‌కు తీసుకువచ్చినట్లు చెప్పిన జిల్లా ఎస్పీ శరద్ చౌదరీ ప్రస్తుతం తల్లికి అప్పగించినట్లు వెల్లడించారు. ఇక చిన్నారిని నవంబర్ 15న రాజస్థాన్ హైకోర్టులో ప్రవేశపెడతామని వెల్లడించారు. అయితే ఆ చిన్నారిని ఎవరో గర్భవతిని చేశారని.. ప్రస్తుతం ఆమె నాలుగు నెలల గర్భంతో వుందని పోలీసులు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments