Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూజారిని సజీవ దహనం చేశారు.. భూమికోసం పెట్రోల్ పోసి ఘోరంగా..?

Webdunia
శుక్రవారం, 9 అక్టోబరు 2020 (17:07 IST)
పరువు హత్యలు ఒకవైపు, మహిళలపై అఘాయిత్యాలు మరోవైపు.. ఇక కక్షలు వేరొక వైపు.. ఇలా దేశంలో నేరాల సంఖ్య మాత్రం పెరిగిపోతుంది. తాజాగా రాజస్థాన్‌లోని కరౌలీ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. 50 ఏళ్ళ పూజారిని దుండగులు పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు. ఈయనను బాబూలాల్ వైష్ణవ్‌గా గుర్తించారు. 5.2 ఎకరాల భూమికి సంబందించిన వివాదమే ఈ ఘోరానికి కారణమని తెలుస్తోంది. 
 
రాధాకృష్ణ టెంపుల్ ట్రస్టుకు చెందిన ఈ భూమి జిల్లా సమీపంలోని గ్రామంలో ఉంది. అయితే ఈ స్థలాన్ని ప్రభుత్వం పూజారుల మనుగడకు కేటాయించింది. ఇక్కడే తన సొంత ఇంటిని నిర్మించుకోవాలని వైష్ణవ్ నిర్ణయించుకుని అందుకు ప్రయత్నించగా గ్రామంలోని అగ్ర వర్ణ మీనా కులస్థుల కన్ను ఈ భూమిపై పడింది. 
 
వారు అక్రమంగా అక్కడ షెడ్ నిర్మించగా వైష్ణవ్ అభ్యంతరం చెప్పడంతో పంచాయతీ గ్రామ పెద్దలవరకు వెళ్ళింది. అయితే తీర్పు పూజారికి అనుకూలంగా రావడంతో అగ్రవర్ణ కులస్థులు కక్ష గట్టి వైష్ణవ్ ఫై పెట్రోల్ పోసి సజీవదహనం చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments