Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆందోళనకు దిగిన పుల్వామా అమరుల భార్యలు అరెస్టు!

Webdunia
శుక్రవారం, 10 మార్చి 2023 (16:13 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామాలో ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో 40 మంది జవాన్ల కుటుంబాలు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడితో యావత్ దేశం ఉలికిపాటుకు గురైంది. అయితే, ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని పలు ప్రభుత్వాన్ని ఢంకా బజాయిస్తూ ప్రకటనలు గుప్పించాయి. ఈ దాడి ఘటన జరిగి మూడేళ్లు గడిచిపోయింది. 
 
ఈ క్రమంలో తమకు న్యాయం జరగలేదని రాజస్థాన్‌లో అమరుల భార్యలు ఆరోపిస్తూ రోడ్డెక్కారు. పుల్వామా బాంబు పేలుడులో రాజస్థాన్‌కు చెందిన ముగ్గురు జవాన్లు అమరులయ్యారు. వీరిని ఆదుకుంటామని రాజస్థాన్ ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది. కానీ, ఆ తర్వాత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ క్రమంలో గత నెల 28వ తేదీ నుంచి తమకు న్యాయం చేయాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలెట్ ఇంటి ముందు ధర్నాకు దిగారు. 
 
ఈ విషయం తెలుసుకున్న సచిన్ పైలెట్ అమరవీరుల భార్యలతో స్వయంగా మాట్లాడి, ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అయినప్పటికీ వారు ఏమాత్రం వినిపించుకోలేదు. దీంతో పోలీసులు వారిపట్ల దురుసుగా ప్రవర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. పోలీసుల తీరుపై మండిపడింది. వితంతువులపై భౌతిక దాడి జరిగిందని, దీనిపై వివరణ ఇవ్వాలంటూ రాజస్థాన్ డీజీపీకి లేఖ రాసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments