Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆందోళనకు దిగిన పుల్వామా అమరుల భార్యలు అరెస్టు!

Webdunia
శుక్రవారం, 10 మార్చి 2023 (16:13 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామాలో ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో 40 మంది జవాన్ల కుటుంబాలు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడితో యావత్ దేశం ఉలికిపాటుకు గురైంది. అయితే, ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని పలు ప్రభుత్వాన్ని ఢంకా బజాయిస్తూ ప్రకటనలు గుప్పించాయి. ఈ దాడి ఘటన జరిగి మూడేళ్లు గడిచిపోయింది. 
 
ఈ క్రమంలో తమకు న్యాయం జరగలేదని రాజస్థాన్‌లో అమరుల భార్యలు ఆరోపిస్తూ రోడ్డెక్కారు. పుల్వామా బాంబు పేలుడులో రాజస్థాన్‌కు చెందిన ముగ్గురు జవాన్లు అమరులయ్యారు. వీరిని ఆదుకుంటామని రాజస్థాన్ ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది. కానీ, ఆ తర్వాత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ క్రమంలో గత నెల 28వ తేదీ నుంచి తమకు న్యాయం చేయాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలెట్ ఇంటి ముందు ధర్నాకు దిగారు. 
 
ఈ విషయం తెలుసుకున్న సచిన్ పైలెట్ అమరవీరుల భార్యలతో స్వయంగా మాట్లాడి, ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అయినప్పటికీ వారు ఏమాత్రం వినిపించుకోలేదు. దీంతో పోలీసులు వారిపట్ల దురుసుగా ప్రవర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. పోలీసుల తీరుపై మండిపడింది. వితంతువులపై భౌతిక దాడి జరిగిందని, దీనిపై వివరణ ఇవ్వాలంటూ రాజస్థాన్ డీజీపీకి లేఖ రాసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments