Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్ ట్రయల్... రాజస్థాన్ ఇంటర్వెల్... బీజేపీపై శివసేన ఎంపీ సెటైర్లు

కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తోందని శివసేన పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ అభిప్రాయపడ్డారు. ఫలితంగానే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ట్రయల్ కాగా, రాజస్థాన్ అసెంబ్లీ ఉప ఎ

Webdunia
మంగళవారం, 6 ఫిబ్రవరి 2018 (09:00 IST)
కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తోందని శివసేన పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ అభిప్రాయపడ్డారు. ఫలితంగానే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ట్రయల్ కాగా, రాజస్థాన్ అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు ఇంటర్వెల్‌, పూర్తి బొమ్మ 2019లో కనిపిస్తుందన్నారు. ప్రధాని మోడీ ఓ నియంతలా వ్యవహరిస్తున్నారనీ, ఆ కారణంగానే తాము పొత్తుకు స్వస్తి చెప్పినట్టు ఆయన వెల్లడించారు. 
 
ఇకపోతే, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి రాజస్థాన్ బీజేపీ నేతల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. రెండు లోక్‌సభ, ఒక శాసనసభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఘోరపరాజయం చవిచూసిన విషయం తెల్సిందే. దీంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వసుంధరరాజెపై అసమ్మతి తీవ్రమవుతోంది. ఆమె రాజీనామా చేయాలన్న డిమాండ్‌ ఊపందుకుంటోంది. 
 
పదవి నుంచి ఆమెను తప్పించాలని కొందరు అసమ్మతి బీజేపీ నేతలు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాకు లేఖ రాశారు. ఆమె వల్లే ఉప ఎన్నికల్లో ఓడిపోయామని, సీఎంగా కొనసాగితే ఈ ఏడాది చివరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరాజయం ఖాయమని పేర్కొన్నారు. అయితే ఉప ఎన్నికల్లో ఓటమి బీజేపీకి మేలుకొలుపని, చేసిన అభివృద్ధి పనులను పార్టీ పెద్దఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆమె పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments