భార్య, తండ్రిని కాపాడబోయిన భర్త.. ముగ్గురూ చనిపోయిన వైనం.. ఎలా?

Webdunia
గురువారం, 7 ఫిబ్రవరి 2019 (11:42 IST)
కోడలిని కాపాడేందుకు మామ, వారిద్దరినీ కాపాడేందుకు భర్త చెరువులో దూకి ప్రాణాలు విడిచారు. రాజస్థాన్‌లోని బీకనెర్ జిల్లాలోని లూణాకరణ్‌సర్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. సీఓ దుర్గాపాల్ అందించిన సమాచారం ప్రకారం కిస్తురియా గ్రామంలో భన్వర్‌లాల్ అనే వ్యక్తి కుటుంబంతోపాటు నివసిస్తున్నాడు. సాయంత్రం 6 గంటల సమయంలో కోడలు లక్ష్మి (23) మంచినీళ్లు తేవడానికి చెరువు వద్దకు వెళ్లింది. నీళ్లు తోడుతుండగా ప్రమాదవశాత్తూ కాలుజారి చెరువులో పడిపోయింది. 
 
భయంతో ఆమె కేకలు వేయగా మామ భన్వర్‌లాల్(50) అక్కడకు పరుగున వచ్చి, కోడలి పరిస్థితిని చూచి కాపాడేందుకు తాను కూడా చెరువులోకి దూకాడు. వారిద్దరూ మునిగిపోవడం చూసి లక్ష్మి భర్త లేఖ్‌రామ్ (24) కూడా వారిని కాపాడేందుకు చెరువులో దూకాడు. చెరువు చాలా లోతుగా ఉండటంతో బయటకు రాలేకపోయారు. పరిస్థితిని గమనించిన భన్వర్‌లాల్ భార్య వారిని రక్షించేందుకు తాడును విసిరింది. వారు దానిని పట్టుకోవడంలో విఫలమై చెరువు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. చెరువు 15 అడుగుల లోతు ఉన్నందున మృతదేహాలను బయటకు తీసేందుకు పోలీసులు నీటిని మోటార్‌లతో బయటకు తోడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

Rana: చాయ్ షాట్స్ కంటెంట్, క్రియేటర్స్ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా: రానా దగ్గుపాటి

Pawan Kalyan!: పవన్ కళ్యాణ్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

తర్వాతి కథనం
Show comments