Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య, తండ్రిని కాపాడబోయిన భర్త.. ముగ్గురూ చనిపోయిన వైనం.. ఎలా?

Webdunia
గురువారం, 7 ఫిబ్రవరి 2019 (11:42 IST)
కోడలిని కాపాడేందుకు మామ, వారిద్దరినీ కాపాడేందుకు భర్త చెరువులో దూకి ప్రాణాలు విడిచారు. రాజస్థాన్‌లోని బీకనెర్ జిల్లాలోని లూణాకరణ్‌సర్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. సీఓ దుర్గాపాల్ అందించిన సమాచారం ప్రకారం కిస్తురియా గ్రామంలో భన్వర్‌లాల్ అనే వ్యక్తి కుటుంబంతోపాటు నివసిస్తున్నాడు. సాయంత్రం 6 గంటల సమయంలో కోడలు లక్ష్మి (23) మంచినీళ్లు తేవడానికి చెరువు వద్దకు వెళ్లింది. నీళ్లు తోడుతుండగా ప్రమాదవశాత్తూ కాలుజారి చెరువులో పడిపోయింది. 
 
భయంతో ఆమె కేకలు వేయగా మామ భన్వర్‌లాల్(50) అక్కడకు పరుగున వచ్చి, కోడలి పరిస్థితిని చూచి కాపాడేందుకు తాను కూడా చెరువులోకి దూకాడు. వారిద్దరూ మునిగిపోవడం చూసి లక్ష్మి భర్త లేఖ్‌రామ్ (24) కూడా వారిని కాపాడేందుకు చెరువులో దూకాడు. చెరువు చాలా లోతుగా ఉండటంతో బయటకు రాలేకపోయారు. పరిస్థితిని గమనించిన భన్వర్‌లాల్ భార్య వారిని రక్షించేందుకు తాడును విసిరింది. వారు దానిని పట్టుకోవడంలో విఫలమై చెరువు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. చెరువు 15 అడుగుల లోతు ఉన్నందున మృతదేహాలను బయటకు తీసేందుకు పోలీసులు నీటిని మోటార్‌లతో బయటకు తోడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments