Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీయూలో మహిళపై అత్యాచారం.. ఇంజెక్షన్ ఇచ్చి ఆపై కర్టెన్లను కప్పుకుని?

సెల్వి
మంగళవారం, 27 ఫిబ్రవరి 2024 (20:43 IST)
రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో ఓ ప్రైవేట్ ఆసుపత్రి ఐసీయూలో చేరిన 24 ఏళ్ల మహిళపై నర్సింగ్ అసిస్టెంట్ మంగళవారం అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. బాధితురాలు మహిళ ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ కారణంగా ఆసుపత్రిలో చేరిందని, ఐసియులో చికిత్స పొందుతోంది. 
 
నిందితుడు చిరాగ్ యాదవ్ మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో బాధితురాలు ప్రాణాలతో బయటపడింది. నిందితుడు తనకు ఇంజెక్షన్ ఇచ్చాడని, ఆ తర్వాత ఆమె అపస్మారక స్థితికి చేరుకుందని పోలీసులు తెలిపారు.
 
తన భర్త మొబైల్‌కి కాల్ చేయడంతో మహిళ స్పృహలోకి వచ్చిందని.. ఆమెపై తనకు జరిగిన ఘోరం గురించి తన కుటుంబ సభ్యులకు తెలిపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని.. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 
 
నిందితుడి బాధితురాలి బెడ్‌పైకి వెళ్లి కర్టెన్‌లతో కప్పుకున్నట్లు కనిపించిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని, విచారణ జరుపుతున్నామని పోలీసులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments