భర్తను ఇంట్లోనే పాతిపెట్టింది.. కానీ నేను చంపలేదంటోంది.. డబ్బుల్లేక..?
తన భర్త మృతదేహాన్ని ఆ భార్య ఇంట్లోనే పాతిపెట్టింది. ఏడాది కాలం పాటు భర్త కనిపించట్లేదని చెప్పుకొచ్చిన సదరు మహిళ... ఆమె ఇంటి నుంచి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆమె భర్త శవం ఇంట్ల
తన భర్త మృతదేహాన్ని ఆ భార్య ఇంట్లోనే పాతిపెట్టింది. ఏడాది కాలం పాటు భర్త కనిపించట్లేదని చెప్పుకొచ్చిన సదరు మహిళ... ఆమె ఇంటి నుంచి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆమె భర్త శవం ఇంట్లోనే ఉన్నట్లు చెప్పింది. దీంతో పోలీసులు, ఇరుగుపొరుగు వారు షాకయ్యారు. ఛత్తీస్గఢ్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. 45 ఏళ్ల రాజ్వీందర్ మృతదేహాన్ని ఇంట్లోని పడక గదిలో ఆతని భార్య మన్ ప్రీత్ పూడ్చిపెట్టింది. ఆమె ఇంటి నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరిగింటి వారికి అసలు విషయం చెప్పింది.
సిక్కు సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించడానికి, సమాధి నిర్మాణానికి తన వద్ద డబ్బులు లేకపోవడంతో పడకగదిలో భర్తను సమాధి చేసినట్లు మన్ ప్రీత్ చెప్పింది. ఈ ఘటనపై కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మన్ ప్రీత్ను అదుపులోకి తీసుకున్నారు.