Webdunia - Bharat's app for daily news and videos

Install App

చల్లని కబురు.. జూన్ ఒకటో తేదీ కంటే ముందే నైరుతి రుతుపవనాలు

Webdunia
గురువారం, 13 మే 2021 (10:15 IST)
rains
ఎండవేడిమికి నానా తంటాలు పడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది నిర్ణీత గడువు అంటే జూన్‌ ఒకటో తేదీ కంటే ముందే వస్తాయని పలువురు వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం హిందూ మహాసముద్రం, దానికి ఆనుకొని అరేబియా సముద్రంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటమే దీనికి కారణమని విశ్లేషిస్తున్నారు.
 
వచ్చే రెండు, మూడు రోజుల్లో రుతుపవనాలపై స్పష్టత వస్తుందని ఇస్రోకు చెందిన వాతావరణ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఆగ్నేయ అరేబియా సముద్రంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడనుందని, అది బలపడి ఆదివారం వాయుగుండంగా మారుతుందని వివరించారు. తరువాత ఉత్తర వాయువ్యంగా పయనించి తూర్పు, మధ్య అరేబియా సముద్రంలో ప్రవేశించి మరింత బలపడి తుఫాన్‌గా మారుతుందని పేర్కొన్నారు.
 
ఇది తుఫాన్‌గా మారిన తరువాత గుజరాత్‌, పాకిస్థాన్‌ తీరం దిశగా పయనిస్తుందని అంచనా వేశారు. తద్వారా ఏపీ, తెలంగాణలో వచ్చే రెండ్రోజుల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

సంబంధిత వార్తలు

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

మనం- పదేళ్ళు సందర్భంగా ఏపీ, తెలంగాణలో మే23న స్పెషల్ షోలు

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments