Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రామిక్ రైళ్లలో ప్రయాణించిన 80మంది మృతి..

Webdunia
శనివారం, 30 మే 2020 (12:46 IST)
శ్రామిక్ రైళ్లలో ప్రయాణించిన 80 మంది మృతి చెందారు. దేశంలో లాక్‌డౌన్‌లో చిక్కుకుపోయిన వారిని స్వస్థలాలకు తరలించేందుకు మే 9 నుంచి 27వ తేదీ వరకు రైల్వేశాఖ నడిపిన సంగతి తెలిసిందే. శ్రామిక్ స్పెషల్ రైళ్లలో 80 మంది వలస కార్మికులు మరణించారని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సమీక్షలో వెల్లడైంది. 
 
రైల్వేశాఖ మే 1 నుంచి 27వ తేదీ వరకు దేశంలో 3,840 శ్రామిక్ స్పెషల్ రైళ్లను నడిపి 5 మిలియన్ల మంది వలస కార్మికులకు వారి స్వస్థలాలకు చేర్చింది. శ్రామిక్ రైళ్లలో ఆకలి, వేడి వల్ల పలువురు వలస కార్మికులు రైళ్లలోనే మరణించారు. దీర్ఘకాల జబ్బులతో బాధపడుతున్న వలస కార్మికులు రైలు ప్రయాణంలో మరణించారని రైల్వే శాఖ ప్రకటించింది. 
 
శ్రామిక్ రైళ్లలో 80 మంది మరణించారని రైల్వే అధికారిక ప్రతినిధి వెల్లడించారు. రైళ్లలో ప్రయాణికులు ఎవరైనా అనారోగ్యానికి గురైతే రైలును ఆపి వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామని రైల్వేబోర్డు ఛైర్మన్ వీకే యాదవ్ చెప్పారు. రైళ్లలో భోజనం దొరక్క ఎవరూ మరణించలేదని రైల్వేబోర్డు ఛైర్మన్ చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పొట్టి దుస్తులు అందుకే వేసుకోను.. నిజం చెప్పిన సాయిపల్లవి?

బాలీవుడ్ దర్శకుడు మనోజ్ కుమార్ ఇకలేరు...

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments