Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి పదవికి సురేష్ ప్రభు రాజీనామా.. ఆమోదించని మోడీ.. ఎందుకు?

మానవ తప్పిదం కారణంగా ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో జరిగిన వరుస రైలు ప్రమాదాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్‌ ప్రభు తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే, ఈ రాజీనామాను ప్రధానమంత్రి

Webdunia
గురువారం, 24 ఆగస్టు 2017 (06:38 IST)
మానవ తప్పిదం కారణంగా ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో జరిగిన వరుస రైలు ప్రమాదాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్‌ ప్రభు తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే, ఈ రాజీనామాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆమోదించలేదు. 
 
గత నాలుగు రోజుల్లో యూపీలో రెండు రైలు ప్రమాదాలు జరిగాయి. ముజఫర్‌నగర్‌ సమీపంలో గత వారంలో ఉత్కళ్‌ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పి 23 మంది మరణించగా వంద మందికిపైగా గాయపడ్డారు. ఇది పూర్తిగా మానవతప్పిదంగా తేలింది.
 
ఈ ప్రమాదం మరవకముందే తాజాగా బుధవారం అరియా ప్రాంతంలో కైఫియత్‌ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 70 మందికిపైగా గాయపడ్డారు. ఈ రెండు ఘటనలతో మనస్తాపానికి గురైన సురేశ్‌ ప్రభు.. రాజీనామా చేద్దామని నిర్ణయించుకొని ప్రధాని మోడీని కలిశారు. అయితే మోడీ తొందరపడొద్దని ప్రభుకు సూచించారు. 
 
అయితే ఈ నేపథ్యంలో రైలు ప్రమాదాలకు నైతిక బాధ్యత వహిస్తూ గతంలో రాజీనామాలు సమర్పించిన రైల్వే మంత్రులు ఉన్నారు. వీరిలో మనకు మొదటగా గుర్తుకు వచ్చేది మాజీ ప్రధాని లాల్‌బహదూర్‌ శాస్త్రీనే. 
 
* 1956లో మద్రాసుకు 174 మైళ్ల దూరంలోని ఆరియాల్‌పూర్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 152 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ అప్పటి రైల్వే శాఖ మంత్రి లాల్‌బహదూర్‌ శాస్త్రీ తన పదవికి రాజీనామా చేశారు. ఇలా నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడంతో ఆయన పరపతి కూడా పెరిగింది. అనంతరం ఆయన్ను తిరిగి మంత్రివర్గంలోకి తీసుకున్నారు. 
 
* నితీశ్‌కుమార్‌ : 1999లో పశ్చిమ్‌బంగలోని గైసల్‌ వద్ద ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 290 మంది మరణించగా.. వందలాది మంది గాయపడ్డారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ అప్పటి సంకీర్ణ ప్రభుత్వంలో రైల్వే శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నితీశ్‌కుమార్‌ రాజీనామా సమర్పించారు. 
 
* మమతా బెనర్జీ : 2000వ సంవత్సరంలో జరిగిన రెండు రైలు ప్రమాదాలకు నైతిక బాధ్యత వహిస్తూ అప్పటి రైల్వే శాఖ మంత్రి మమతా బెనర్జీ పదవికి రాజీనామా సమర్పించారు. అయితే అప్పటి ప్రధాని వాజ్‌పేయీ ఆమె రాజీనామాను తిరస్కరించారు. 
 
* ప్రస్తుతం యూపీలో జరిగిన రెండు వరుస ప్రమాదాలకు బాధ్యత వహిస్తూ రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ ప్రభు రాజీనామాకు సిద్ధ‌ప‌డ్డా .. ప్రధాని మోదీ అంగీకరించలేదు. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments