Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్ 'ఖాట్‌‌పే' చర్చ ముగియగానే మంచాల కోసం ఘర్షణ... ఎక్కడ?

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేపట్టిన కిసాన్ యాత్రలో భాగంగా రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. దీనికి 'ఖాట్‌‌పే చర్చ' అనే నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా రైతులు, రాహుల్‌ కూర

Webdunia
బుధవారం, 7 సెప్టెంబరు 2016 (06:53 IST)
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేపట్టిన కిసాన్ యాత్రలో భాగంగా రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. దీనికి 'ఖాట్‌‌పే చర్చ' అనే నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా రైతులు, రాహుల్‌ కూర్చొని మాట్లాడుకొనేందుకు 2 వేల కొత్త మంచాలను కాంగ్రెస్ నేతలు తయారు చేయించారు. 
 
ఈ రైతులతో ముఖాముఖి చర్చా కార్యక్రమం ముగిసిందో లేదో సభకు హాజరైన రైతులు, ప్రజలు కొత్త మంచాలను తమ ఇళ్లకు తీసుకెళ్లేందుకు ఎగబడ్డారు. దీంతో సభాప్రాంగణంలో పెద్ద ఎత్తున ఘర్షణ చోటుచేసుకొంది. సభ ముగిసిన కొద్ది నిమిషాలకే అక్కడ ఏర్పాటు చేసిన 2 వేల మంచాలు మాయమైపోయి సభాప్రాంగణం బోసిపోయి కనిపించింది. 
 
అయితే తొలిరోజే ఖాట్‌పే చర్చ రసాభాసగా మారడంతో కాంగ్రెస్‌ పెద్దలు దీనిపై పునరాలోచనలో పడ్డారు. కాంగ్రెస్‌ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత కిషోర్‌ ‘ఖాట్‌పే చర్చ’ ఆలోచనను తెరపైకి తెచ్చిన విషయం తెల్సిందే. ఇదిలావుండగా, వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలోని డియోరియా నుంచి ఢిల్లీ వరకు 2500 కిలోమీటర్ల మేర కిసాన్‌ యాత్రను రాహుల్‌ మంగళవారం ప్రారంభించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments