Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్ 'ఖాట్‌‌పే' చర్చ ముగియగానే మంచాల కోసం ఘర్షణ... ఎక్కడ?

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేపట్టిన కిసాన్ యాత్రలో భాగంగా రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. దీనికి 'ఖాట్‌‌పే చర్చ' అనే నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా రైతులు, రాహుల్‌ కూర

Webdunia
బుధవారం, 7 సెప్టెంబరు 2016 (06:53 IST)
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేపట్టిన కిసాన్ యాత్రలో భాగంగా రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. దీనికి 'ఖాట్‌‌పే చర్చ' అనే నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా రైతులు, రాహుల్‌ కూర్చొని మాట్లాడుకొనేందుకు 2 వేల కొత్త మంచాలను కాంగ్రెస్ నేతలు తయారు చేయించారు. 
 
ఈ రైతులతో ముఖాముఖి చర్చా కార్యక్రమం ముగిసిందో లేదో సభకు హాజరైన రైతులు, ప్రజలు కొత్త మంచాలను తమ ఇళ్లకు తీసుకెళ్లేందుకు ఎగబడ్డారు. దీంతో సభాప్రాంగణంలో పెద్ద ఎత్తున ఘర్షణ చోటుచేసుకొంది. సభ ముగిసిన కొద్ది నిమిషాలకే అక్కడ ఏర్పాటు చేసిన 2 వేల మంచాలు మాయమైపోయి సభాప్రాంగణం బోసిపోయి కనిపించింది. 
 
అయితే తొలిరోజే ఖాట్‌పే చర్చ రసాభాసగా మారడంతో కాంగ్రెస్‌ పెద్దలు దీనిపై పునరాలోచనలో పడ్డారు. కాంగ్రెస్‌ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత కిషోర్‌ ‘ఖాట్‌పే చర్చ’ ఆలోచనను తెరపైకి తెచ్చిన విషయం తెల్సిందే. ఇదిలావుండగా, వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలోని డియోరియా నుంచి ఢిల్లీ వరకు 2500 కిలోమీటర్ల మేర కిసాన్‌ యాత్రను రాహుల్‌ మంగళవారం ప్రారంభించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments