Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్ గాంధీపై అనర్హత వేటు - లోక్‌సభ సెక్రటరీ ఆదేశాలు జారీ

Webdunia
శుక్రవారం, 24 మార్చి 2023 (14:33 IST)
'దొంగలందరికీ మోడీ' అనే ఇంటిపేరు ఎందుకు ఉంటుందో అని గత 2019లో కర్నాటక ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యానించగా, దీనిపై గుజరాత్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఒకరు దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో సూరత్ కోర్టు గురువారం తీర్పును వెలువరించింది. ఈ తీర్పులో రాహుల్‌కు రెండేళ్లు జైలుశిక్షతో పాటు రూ.15 వేల అపరాధం కూడా విధించింది.
 
అయితే, ప్రజాప్రాతినిధ్యం చట్టం ప్రకారం రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ జైలుశిక్ష పడిన వ్యక్తి తీర్పు వెలువడిన తేదీ నుంచి రాజ్యంగ పదవుల్లో ఉండటానికి గానీ లేదా ఎన్నికల్లో పోటీ చేయడానికి గానీ వీల్లేదు. అదేసమయంలో ఈ తీర్పును ఆధారంగా చేసుకుని రాహుల్ గాంధీపై లోకసభ సెక్రటరీ అనర్హత వేటు పడింది. ఈ మేరకు లోక్‌సభ సెక్రటరీ ఉత్పాల్ కుమార్ సింగ్ శుక్రవారం ఆదేశాలు జారీచేశారు.
 
ఇదిలావుంటే, శుక్రవారం ఆయన పార్లమెంటుకు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఉదయం పార్లమెంట్‌ ప్రాంగణంలో జరిగిన పార్టీ ఎంపీల సమావేశానికి రాహుల్‌ హజరయ్యారు. ఆ తర్వాత లోక్‌సభ ప్రారంభం కాగానే ఆ సమావేశంలో పాల్గొన్నారు. మరోవైపు, రాహుల్‌ గాంధీకి జైలు శిక్ష పడిన నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ నేడు దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. దీంతో దేశ రాజధాని దిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Khaleja: ఖలేజా రీ-రిలీజ్- మొదటి రోజే రూ.8కోట్లు.. ఆల్ టైమ్ రికార్డ్ నమోదు

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

Nikhil: నిఖిల్ కత్తి యోధుడిలా సంయుక్త విల్లు బాణంతో స్వయంభు లో యాక్షన్ సీన్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments