Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్‌కు కోపమొచ్చింది.. ఢిల్లీ అధికారులు బిత్తరపోయారు!!

Webdunia
శుక్రవారం, 28 నవంబరు 2014 (17:12 IST)
రాహుల్ గాంధీకి కోపం ఒక్కసారి కట్టలు తెంచుకుంది. దీంతో ఢిల్లీ మున్సిపల్ అధికారులు హడలిపోయారు. ఢిల్లీలోని మురికివాడల్లో ఉన్న గుడిసెలను తొలగించేందుకు వెళ్లిన అధికారులకు ఆయన షాకిచ్చారు. గుడిసెలు తొలగించాలంటే ముందుగా తనపై నుంచి బుల్డోజర్లు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు. 
 
ఢిల్లీ రంగ్ పురి పహాడీ ప్రాంతంలో ఇళ్ల కూల్చివేతకు అధికారులు దిగడం పట్ల రాహుల్ తీవ్రంగా స్పందించారు. మరోసారి ఆ ప్రాంతంలో ఆ ఇళ్లను కూల్చాలని ప్రభుత్వం నిర్ణయించుకుంటే, బుల్డోజర్లను తనపై ఎక్కించుకుని పోనివ్వాలని సవాల్ విసిరారు. పహాడీని సందర్శించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 
 
పేదల తరపున పోరాడతానని అక్కడి వాసులకు హామీ ఇచ్చారు. 900 ఇళ్లను కూల్చగా వేలమంది నిరాశ్రయులయ్యారు. తక్షణమే ఇళ్ల కూల్చివేతను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం చలికాలమని, కనీసం హెచ్చరికలు కూడా చేయకుండా, ఇళ్లు నేలమట్టం చేశారని రాహుల్ మండిపడ్డారు. 

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

Show comments