Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నా.. ప్రశ్నపత్రం లీక్ చేసిన వ్యక్తి కార్యదర్శా? అతను వద్దనే వద్దు...

Webdunia
శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (15:16 IST)
ఉత్తరప్రదేశ్‌ కాంగ్రెస్‌ తూర్పు ప్రాంత ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ప్రియాంకా గాంధీ తన అన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దృష్టికి ఓ విషయం తీసుకెళ్లారు. దీనిపై ఆయన తక్షణం స్పందించారు. ప్రియాంకాకు ఏఐసీసీ కార్యదర్శిగా నియమించిన వ్యక్తిని తొలగించారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఉత్తరప్రదేశ్‌ కాంగ్రెస్‌ తూర్పు ప్రాంత ప్రధాన కార్యదర్శిగా ప్రియాంకా గాంధీ నియమితులయ్యారు. ఆమెకు ఏఐసీసీ కార్యదర్శిగా కుమార్‌ ఆశిష్ నేతను రాహుల్ నియమించారు. అయితే, 2005లో బిహార్‌లో పరీక్ష పేపరు లీక్‌ వ్యవహారంలో ఆయనకు సంబంధం ఉన్నట్టు వార్తలు వచ్చాయి. దీనిపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. 
 
దీంతో మేల్కొన్న ప్రియాంకా గాంధీ.. ఈ వ్యవహారంపై ఆరా తీశారు. ఆమె పరిశీలనలో కుమార్ అశిష్ 2005లో పరీక్ష పేపర్‌ను లీక్ చేసినట్టు వెల్లడైంది. దీంతో వెంటనే కుమార్‌ను తొలగించాలని రాహుల్‌కు ప్రియాంక అభ్యర్థించారు. దీనిపై స్పందించిన రాహుల్ గాంధీ.. తన చెల్లి అభ్యర్థన మేరకు కుమార్‌ను తొలగించారు. కాగా, కుమార్‌ మంగళవారమే పార్టీలో మళ్లీ చేరారు. చేరిన తర్వాతి రోజే తొలగింపునకు గురికావడం విశేషం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ హీరో కళ్లలో గమ్మత్తైన ఆకర్షణ ఉంది : షాలిని పాండే

సిలికాన్‌లో ఏఐ రీసెర్చ్ సెంటర్‌ లో సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిసిన కమల్ హాసన్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments