Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నా.. ప్రశ్నపత్రం లీక్ చేసిన వ్యక్తి కార్యదర్శా? అతను వద్దనే వద్దు...

Webdunia
శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (15:16 IST)
ఉత్తరప్రదేశ్‌ కాంగ్రెస్‌ తూర్పు ప్రాంత ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ప్రియాంకా గాంధీ తన అన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దృష్టికి ఓ విషయం తీసుకెళ్లారు. దీనిపై ఆయన తక్షణం స్పందించారు. ప్రియాంకాకు ఏఐసీసీ కార్యదర్శిగా నియమించిన వ్యక్తిని తొలగించారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఉత్తరప్రదేశ్‌ కాంగ్రెస్‌ తూర్పు ప్రాంత ప్రధాన కార్యదర్శిగా ప్రియాంకా గాంధీ నియమితులయ్యారు. ఆమెకు ఏఐసీసీ కార్యదర్శిగా కుమార్‌ ఆశిష్ నేతను రాహుల్ నియమించారు. అయితే, 2005లో బిహార్‌లో పరీక్ష పేపరు లీక్‌ వ్యవహారంలో ఆయనకు సంబంధం ఉన్నట్టు వార్తలు వచ్చాయి. దీనిపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. 
 
దీంతో మేల్కొన్న ప్రియాంకా గాంధీ.. ఈ వ్యవహారంపై ఆరా తీశారు. ఆమె పరిశీలనలో కుమార్ అశిష్ 2005లో పరీక్ష పేపర్‌ను లీక్ చేసినట్టు వెల్లడైంది. దీంతో వెంటనే కుమార్‌ను తొలగించాలని రాహుల్‌కు ప్రియాంక అభ్యర్థించారు. దీనిపై స్పందించిన రాహుల్ గాంధీ.. తన చెల్లి అభ్యర్థన మేరకు కుమార్‌ను తొలగించారు. కాగా, కుమార్‌ మంగళవారమే పార్టీలో మళ్లీ చేరారు. చేరిన తర్వాతి రోజే తొలగింపునకు గురికావడం విశేషం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఫోటోలు తీయొద్దు.. అసహనం వ్యక్తం చేసిన సమంత- వీడియో వైరల్

కుబేర కు సీక్వెల్ వుండదు - లీడర్ కి సీక్వెల్ ఇప్పట్లో చేయలేం : శేఖర్ కమ్ముల

Sidhu : చివరి షెడ్యూల్లో సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా - సైమల్టేనియస్‌గా డబ్బింగ్

Ram Charan: పుష్ప 2 ఫైట్ మాస్టర్ నబాకాంత్ తో పెద్ది లో రామ్ చరణ్ ట్రైన్ యాక్షన్ షూటింగ్

మై హోమ్ అవతార రెసిడెంట్స్ లో సందడిగా తమ్ముడు ఫస్ట్ లిరికల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments