Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లో భోజనం చేసి తల్లిని పరామర్శించి ఈడీ ఆఫీసుకు వచ్చిన రాహుల్

Webdunia
సోమవారం, 13 జూన్ 2022 (17:00 IST)
కాంగ్రెస్ పూర్వ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మళ్లీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి చేరుకున్నారు. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ ఆర్థిక అవకతవకల కేసులో విచారణ జరిపేందుకు ఈడీ అధికారులు రాహుల్‌తో పాటు.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి సమన్లు జారీచేసింది. అయితే, సోనియా గాంధీకి కరోనా వైరస్ సోకింది. దీంతో ఆమె హాజరుకాలేక పోయారు. 
 
కానీ రాహుల్ గాంధీ మాత్రం సోమవారం ఈడీ విచారణకు వచ్చారు. ఉదయం 11.30 గంటలకు కార్యాలయానికి రాగా, ఆయనను ఈడీ అధికారులు 3 గంటల పాటు విచారించారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో మధ్యాహ్న భోజనం చేసేందుకు రాహుల్ గాంధీ ఇంటికి వెళ్లేందుకు అధికారులు అనుమతించారు. 
 
దీంతో ఆయన ఈడీ కార్యాలయం నుంచి నేరుగా ఇంటికి వెళ్లిన రాహుల్.. అక్కడ భోజనం చేసి ఆ తర్వాత ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన తల్లి సోనియా గాంధీని పరామర్శించారు. అక్కడ నుంచి మళ్లీ ఈడీ కార్యాలయానికి వచ్చి అధికారుల విచారణకు హాజరయ్యారు. దీంతో రాహుల్ వద్ద మళ్లీ విచారణ కొనసాగిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments