Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లో భోజనం చేసి తల్లిని పరామర్శించి ఈడీ ఆఫీసుకు వచ్చిన రాహుల్

Webdunia
సోమవారం, 13 జూన్ 2022 (17:00 IST)
కాంగ్రెస్ పూర్వ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మళ్లీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి చేరుకున్నారు. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ ఆర్థిక అవకతవకల కేసులో విచారణ జరిపేందుకు ఈడీ అధికారులు రాహుల్‌తో పాటు.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి సమన్లు జారీచేసింది. అయితే, సోనియా గాంధీకి కరోనా వైరస్ సోకింది. దీంతో ఆమె హాజరుకాలేక పోయారు. 
 
కానీ రాహుల్ గాంధీ మాత్రం సోమవారం ఈడీ విచారణకు వచ్చారు. ఉదయం 11.30 గంటలకు కార్యాలయానికి రాగా, ఆయనను ఈడీ అధికారులు 3 గంటల పాటు విచారించారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో మధ్యాహ్న భోజనం చేసేందుకు రాహుల్ గాంధీ ఇంటికి వెళ్లేందుకు అధికారులు అనుమతించారు. 
 
దీంతో ఆయన ఈడీ కార్యాలయం నుంచి నేరుగా ఇంటికి వెళ్లిన రాహుల్.. అక్కడ భోజనం చేసి ఆ తర్వాత ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన తల్లి సోనియా గాంధీని పరామర్శించారు. అక్కడ నుంచి మళ్లీ ఈడీ కార్యాలయానికి వచ్చి అధికారుల విచారణకు హాజరయ్యారు. దీంతో రాహుల్ వద్ద మళ్లీ విచారణ కొనసాగిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments