Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్ గాంధీకి అస్వస్థత - ఎన్నికల ప్రచారం రద్దు

ఠాగూర్
గురువారం, 23 జనవరి 2025 (17:59 IST)
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన తన ఢిల్లీ ఎన్నికల ప్రచారాన్ని, ర్యాలీని రద్దు చేసుకున్నారు. వైద్యుల సలహా మేరకు రాహుల్ విశ్రాంతి తీసుకుంటున్నారు. వచ్చే నెల ఐదో తేదీన ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికల పోలింగ్ జరుగనుంది. దీంతో ఢిల్లీలో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థుల తరపున రాహుల్ ప్రచారం చేస్తున్నారు. 
 
ఢిల్లీలోని ముస్తఫాబాద్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సమయంలో రాహుల్ అస్వస్థతకు లోనయ్యారు. ఆయనను పరీక్షించిన వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో రాహుల్ తన ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకున్నారని ఢిల్లీ పీసీసీ చీఫ్ దేవేంద్ర యాదవ్ తెలిపారు. 
 
అయితే, శుక్రవారం మాత్రం యధావిధిగా రాహుల్ ఎన్నికల ప్రచారం సాగుతుందని చెప్పారు. భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించే అవకాశం ఉందని తెలిపారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఏ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదని, ఒంటరిగానే పోటీ చేస్తున్నామనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని సూచించారు. కాగా, భారత గణతంత్ర వేడుకల తర్వాత ఈ ఎన్నికల ప్రచారం మరింత ముమ్మరంకానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అది నా పూర్వజన్మ సుకృతం : మెగాస్టార్ చిరంజీవి

వార్ 2 కోసం కజ్రా రే, ధూమ్ 3 మ్యూజిక్ స్ట్రాటజీ వాడుతున్న ఆదిత్య చోప్రా

Chiranjeevi: నన్ను విమర్శించే పొలిటీషన్ కు గుణపాఠం చెప్పిన మహిళ: చిరంజీవి

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments