Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాసన్‌లో 100 మంది నర్సింగ్ విద్యార్థులకు కరోనా పాజిటివ్

Webdunia
శనివారం, 7 ఆగస్టు 2021 (14:12 IST)
కర్నాటక రాష్ట్రంలోని ఓ ప్రైవేటు నర్సింగ్ కాలేజీ కరోనా హాట్‌స్పాట్‌గా నిలించింది. ఈ కాలేజీకి చెందిన 21 మందికి కరోనా వైరస్ సోకింది. ఆ తర్వాత వీరితో కాంటాక్ట్ అయిన వారికి పరీక్షలు చేయగా, మొత్తం 100 మందికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ రాష్ట్రంలోని హ‌స‌న్ జిల్లాలోని ఓ ప్రైవేటు న‌ర్సింగ్ కాలేజీలో శుక్ర‌వారం 21 మంది విద్యార్థుల‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. మొత్తం ఆ కాలేజీలోని 48 మంది విద్యార్థుల‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా 21 మందికి పాజిటివ్‌గా తేలింది. 
 
పాజిటివ్ వ‌చ్చిన విద్యార్థుల‌తంగా గ‌త నెల 17 నుంచి 21 నుంచి కేర‌ళ నుంచి వ‌చ్చిన‌వారేన‌ని జిల్లా అధికారులు తెలిపారు. అయితే, క‌రోనా పాజిటివ్ వ‌చ్చినా వాళ్ల‌లో ఎవ‌రికీ సింప్ట‌మ్స్ లేవ‌ని చెప్పారు.
 
అయితే, ఒకే న‌ర్సింగ్ కాలేజీలో 21 మందికి పాజిటివ్ రావ‌డంతో అధికారులు హ‌స‌న్ జిల్లాలోని 9 న‌ర్సింగ్ కాలేజీల్లోగ‌ల 900 మంది విద్యార్థుల‌కు క‌రోనా ప‌రీక్షలు చేయించారు. ఆ 900 మందిలో 100 మందికి పాజిటివ్‌గా తేలింది. 
 
వారిలో 24 మంది మొద‌ట పాజిటివ్‌గా తేలిన 21 మందికి ప్రైమ‌రీ కాంటాక్ట్స్ అని ఆరోగ్య అధికారి డాక్ట‌ర్ విజ‌య్ వెల్ల‌డించారు. ఆ 24 మంది తొలి డోసు టీకా వేయించుకున్న వారేన‌ని చెప్పారు. వీరందరినీ ఐసోలేషన్‌కు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments