Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంకపై కుందేలు మాంసం తినొచ్చు... చట్టబద్ధంగా విక్రయాలు!

పుర్రెకో బుద్ధి... జిహ్వకో రుచి అంటుంటారు కదా! అందుకే... మాంసాహారాన్ని ఇష్టపడే వారికి మరో రకం మాసం అందుబాటులోకి రానుంది. ఇకపై దేశవ్యాప్తంగా కుందేలు మాంసం అందుబాటులోకి రానుంది.

Webdunia
గురువారం, 28 జులై 2016 (10:16 IST)
పుర్రెకో బుద్ధి... జిహ్వకో రుచి అంటుంటారు కదా! అందుకే... మాంసాహారాన్ని ఇష్టపడే వారికి మరో రకం మాసం అందుబాటులోకి రానుంది. ఇకపై దేశవ్యాప్తంగా కుందేలు మాంసం అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ఆహార భద్రతా చట్టానికి కేంద్రం తాజాగా మార్పులు చేసింది. 
 
వాస్తవానికి కేరళ, జమ్మూకాశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌, ఈశాన్య రాష్ట్రాల్లోని చాలామంది కుందేలు, చెవుల పిల్లుల మాంసాన్ని ఆరగిస్తుంటారు. కేరళలో అయితే ఏకంగా 15 వేల కుటుంబాలు ఈ మాంసం కోసమే కుందేళ్ళను పెంచుతూ జీవిస్తున్నారు. 
 
అయితే, దేశ వ్యాప్తంగా కుందేలు మాంసాన్ని తినడానికి ఆహార భద్రత, ప్రమాణాల సాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) అనుమతి లేదు. కేవలం గొర్రెలు, మేకలు, పందులు, గేదెలు, అడవిదున్న వంటి పశుమాంసాన్ని తినడానికే ఇది అనుమతిచ్చింది. 
 
ఈ నేపథ్యంలో, కుందేలు మాంసాన్ని కూడా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అనుమతి జాబితాలో చేర్చాలని ప్రధానమంత్రి కార్యాలయానికి భారీగా వినతులు వచ్చాయి. దీంతో, ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ప్రధాని తమను ఆదేశించారని, అందుకే కుందేలు మాంసాన్ని కూడా ఈ జాబితాలోని చేర్చినట్లు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ వర్గాలు ప్రకటించాయి. 

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments