Webdunia - Bharat's app for daily news and videos

Install App

యమునా నది తీరంలో పీవీ నరసింహారావు స్మారక చిహ్నం..!

Webdunia
బుధవారం, 1 ఏప్రియల్ 2015 (10:07 IST)
కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు అందించిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు దేశ రాజధాని ఢిల్లీలో ఎట్టకేలకు స్మారక చిహ్నం దక్కనుంది. ఆయనకు సొంత పార్టీ అయిన కాంగ్రెస్ ఢిల్లీలో స్మారకాన్ని నిరాకరించగా, ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం ఆ గౌరవాన్ని కట్టబెట్టేందుకు సిద్ధమైంది.
 
కాంగ్రెస్ పార్టీలో నెహ్రు కుటుంబ సభ్యులకు తప్ప ఇతరులకు ఎటువంటి ప్రాధాన్యత ఉండదు. కాంగ్రెస్ ప్రచార బ్యానర్లు, పోస్టర్లలో అది కళ్ళకు కట్టినట్లు కనబడుతుంటుంది. అందుకే మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహరావుకు కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి ప్రాధాన్యత లేకుండాపోయింది. 
 
కేంద్రంలో మైనార్టీ ప్రభుత్వ బాధ్యతలు చేపట్టిన పీవీ నరసింహరావు ఐదేళ్ళపాటు ప్రభుత్వాన్ని సమర్ధంగా నడపడమే కాకుండా భారతదేశంలో ఆర్ధిక సంస్కరణలు ప్రవేశపెట్టిన గొప్ప ప్రధాన మంత్రిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. అయితే ఆయనకు కాంగ్రెస్ పార్టీ స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయడానికి కూడా నిరాకరించింది.
 
కాంగ్రెస్ పార్టీ ఆయనను గౌరవించకపోయినప్పటికీ, ఎన్డీయే ప్రభుత్వం ఆయనకు దక్కవలసిన గౌరవమర్యాదలు కల్పించేందుకు, యమున నది ఒడ్డున ఏక్తా స్థల్ సమాధి కాంప్లెక్స్ సముదాయంలో పీవీ మెమోరియల్ ఘాట్ ని నిర్మించడానికి మంత్రిమండలి అమోదం కోసం పట్టణాభివృద్ధిమంత్రిత్వశాఖ ఒక ప్రతిపాదన పంపింది. ఆ ప్రతిపాదనకు కేంద్రమంత్రిమండలి ఆమోదం తెలిపింది. కాంగ్రెస్ చేయలేని ఈ సత్కార్యాన్ని బీజేపీ చేయడం విశేషం.

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

Show comments