Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్కే నగర్‌ ఎన్నికల సర్వే-పుదియ తలైమురై టీవీపై ప్రసారాలు బంద్.. తెలుగోడే టాప్..!?

ఆర్కే నగర్ ఎన్నికలు ఇంకా ప్రారంభం కాకముందే.. ఉప ఎన్నికల్లో తెలుగోడే టాప్‌లో నిలిచారు. అంటే ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న పన్నీర్ సెల్వం గ్రూపులోని మధుసూదన్ వైపే ఆ నియోజక వర్గ ప్రజలున్నారని తా

Webdunia
శనివారం, 8 ఏప్రియల్ 2017 (13:45 IST)
ఆర్కే నగర్ ఎన్నికలు ఇంకా ప్రారంభం కాకముందే.. ఉప ఎన్నికల్లో తెలుగోడే టాప్‌లో నిలిచారు. అంటే ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న పన్నీర్ సెల్వం గ్రూపులోని మధుసూదన్ వైపే ఆ నియోజక వర్గ ప్రజలున్నారని తాజా సర్వేలో తేలిపోయింది. ఆర్కేనగర్ ఎన్నికల ఫలితాలపై పుదియ తలైమురై టీవీ సంస్థ సర్వే నిర్వహించింది. ఈ వివరాలను శుక్రవారం రాత్రి విడుదల చేసింది. 
 
ఈ సర్వేలో ఆర్కే నగర్ నియోజక వర్గ ప్రజలు మధుసూదనన్‌కే పట్టం కట్టారని, ఆయనే గెలిచే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని టీవీ సర్వే ద్వారా తెలిపింది. రెండో స్థానంలో డీఎంకే, మూడో స్థానంలో టీటీవీ దినకరన్, నాలుగో స్థానంలో బీజేపీ, ఐదో స్థానంలో జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ ఉన్నారని సర్వే ద్వారా వెల్లడైంది. కానీ ఈ వివరాలను బహిర్గతం చేసిన పుదియ తలైమురై టీవీ కార్యాలయంపై తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ శశికళ వర్గానికి చెందిన సర్కారు బంద్ చేసింది. 
 
ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న టీటీవీ దినకరన్ ఓడిపోతారని ఓ టీవీ చానల్ సర్వే విడుదల చెయ్యడంతో కేబుల్ ప్రసారాలు కట్ చేశారు. అంతేగాకుండా శనివారం నుంచి పుదియ తలైమురై టీవీ ఛానల్ ప్రసారాలను తమిళ సర్కారు నిలిపివేసింది. ఇదే సర్వేలో విజయ్ కాంత్ కు చెందిన అభ్యర్థి చివరి స్థానంలో ఉన్నాడని వెలుగు చూసింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments