Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరాఖండ్.. 35 కిలోమీటర్ల పాటు వెనక్కి నడిచిన రైలు.. కారణం? (video)

Webdunia
గురువారం, 18 మార్చి 2021 (11:15 IST)
ఉత్తరాఖండ్‌లో ఓ రైలు సాంకేతిక లోపం కారణంగా ఏకంగా 35 కిలోమీటర్ల పాటు వెనక్కి నడిచింది. ట్రాక్‌పైకి వచ్చిన పశువులను ఢీకొట్టకుండా ఉండేందుకు లోకోపైలట్ సడెన్ బ్రేక్ వేశాడు. దీంతో ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తి రైలు వెనక్కి వెళ్లడం మొదలుపెట్టింది. దేశ రాజధాని ఢిల్లీ నుంచి బయలుదేరిన పూర్ణగిరి జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్ ఇంజిన్‌లో ఈ సాంకేతిక సమస్య తలెత్తింది.
 
ఉత్తరాఖండ్‌లోని తనక్‌పూర్ జిల్లాలో ఈ ఘటన జరగగా.. రైలు 35 కిలోమీటర్లు వెనక్కి నడిచి ఖాతిమా దగ్గర ఆగిపోయింది. రైలు చాలా వేగంగా వెనక్కి వస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. సడెన్ బ్రేకు వేయడంతో ఇంజిన్‌పై లోకోపైలట్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ఘటన జరిగింది.
 
ఖాతిమా దగ్గర రైలు నిలిచిపోయిన తర్వాత ప్రయాణికులను కిందికి దించి బస్సుల ద్వారా తనక్‌పూర్‌కు పంపించారు. రైలు లోకోపైలట్‌, గార్డ్‌లను సస్పెండ్ చేశారు. అసలు ఇలా జరగడానికి కారణమేంటన్నది తెలుసుకోవడానికి ఓ సాంకేతిక బృందం తనక్‌పూర్ వెళ్లింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

NTR: రావణుడి కంటే రాముడి పాత్ర కష్టం, అందుకే అదుర్స్ 2 చేయలేకపోతున్నా : ఎన్టీఆర్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments