రోడ్డుపై ఖురాన్ పేజీలు.. ఎమ్మెల్యే ఇంటిని ధ్వంసం చేసిన అల్లరి మూకలు.. 250 మందిపై కేసు
పంజాబ్ రాష్ట్రంలోని లుథియానాలో ఓ ఎమ్మెల్యే ఇంటిని కొందరు అల్లరి మూకలు ధ్వంసం చేశారు. ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్కు సంబంధించిన కొన్ని పేజీలు రోడ్డుపై పడివుండటంతో ఈ అల్లర్లు చెలరేగాయి.
పంజాబ్ రాష్ట్రంలోని లుథియానాలో ఓ ఎమ్మెల్యే ఇంటిని కొందరు అల్లరి మూకలు ధ్వంసం చేశారు. ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్కు సంబంధించిన కొన్ని పేజీలు రోడ్డుపై పడివుండటంతో ఈ అల్లర్లు చెలరేగాయి.
లుథియానాలోని మెలెర్కోట్లాలోని జార్గ్చౌక్ ప్రాంతంలో ఖురాన్కు చెందిన కొన్ని పేజీలు చిరిగిపడివుండటాన్ని కొందరు గమనించారు. ఈ విషయమై ప్రశ్నించేందుకు ఎమ్మెల్యే ఫర్జానా నిస్సారా ఖతూన్ ఇంటికి కొందరు వెళ్లారు. వారిని ఇంట్లోకి అనుమతించేందుకు సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో రెచ్చిపోయిన గుంపులోని కొందరు వారిపై దాడిచేసి ఇంట్లోకి ప్రవేశించి విధ్వంసం సృష్టించారు. ఎమ్మెల్యే వాహనాలను ధ్వంసం చేశారు.
అంతటితో ఆగకుండా, ఎమ్మెల్యే ఇంటి పక్కనే పార్కింగ్ చేసివున్న ప్రైవేట్ బస్సుకు నిప్పుపెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఈ ఘటనకు సంబంధించి 250 మందిపై వివిధ కేసులు నమోదు చేశారు. అయితే ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదు.
దీనిపై స్థానిక డీఎస్పీ రణ్ధీర్ సింగ్ స్పందిస్తూ.. సుమారు 300 మంది వరకు ఒక్కసారి ఎమ్మెల్యే ఇంటి వద్దకు రావడంతో ఆత్మ రక్షణార్థం ఎమ్మెల్యే సెక్యూరిటీ సిబ్బంది కాల్పులు జరిపారని, దీంతో రెచ్చిపోయిన అల్లరి మూక ఇంటిపై దాడి చేసి ధ్వంసం చేసినట్టు చెప్పారు.