Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంజాబ్ రాజకీయాలు : కాంగ్రెస్‌లోకి సిద్ధూ భార్య.. సొంత గూటికి మాజీ క్రికెటర్..?

పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ఈ రాష్ట్రానికి చెందిన మాజీ క్రికెటర్‌ సిద్ధూ భార్య నవజ్యోత్‌ కౌర్‌ ఈ నెల 28న కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు.

Webdunia
గురువారం, 24 నవంబరు 2016 (09:35 IST)
పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ఈ రాష్ట్రానికి చెందిన మాజీ క్రికెటర్‌ సిద్ధూ భార్య నవజ్యోత్‌ కౌర్‌ ఈ నెల 28న కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు. ఆమెతో పాటు ఆవాజ్‌-ఎ-పంజాబ్‌ నేత పర్గత్‌ సింగ్‌ కూడా తమ పార్టీలో చేరతారని పంజాబ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అమరీందర్‌ సింగ్‌ వెల్లడించారు. సిద్ధూ కూడా వీరి బాటలోనే నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. 
 
ఈ మధ్యే బీజేపీ నుంచి బయటకు వచ్చిన సిద్ధూ ఆవాజ్‌-ఎ-పంజాబ్‌ పార్టీని స్థాపించడం తెలిసిందే. కౌర్‌ కూడా భర్త బాటలోనే నడిచారు. ఇటీవలే బీజేపీకి ఆమె రాజీనామా చేశారు.  సొంతంగా పోటీ బరిలోకి దిగాలని మొదట సిద్ధూ భావించారు. అయితే పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సమయం సరిపోదన్న ఆలోచనతో ఆయన వెనక్కు తగ్గారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ తో ఆయన చేతులు కలిపేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్‌ తరపున ఆయన ముఖ్య ప్రచారకుడిగా వ్యవహరిస్తారన్న వార్తలు కూడా వస్తున్నాయి. 

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments