పెద్దనోట్ల రద్దు ఎఫెక్టు : టాక్సీడ్రైవర్ జన్ధన్ ఖాతాలోకి రూ.9806 కోట్లు
దేశంలో పెద్ద నోట్ల రద్దుతో చిత్రవిచిత్ర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. పెద్ద నోట్లు చెలామణిలో ఉన్నపుడు నిరుపేదలుగా ఉన్న వారు.. రాత్రికిరాత్రే కోటీశ్వరులై పోతున్నారు. అలాగే, నల్లకోటీశ్వలు పేదలుగా మారిపోత
దేశంలో పెద్ద నోట్ల రద్దుతో చిత్రవిచిత్ర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. పెద్ద నోట్లు చెలామణిలో ఉన్నపుడు నిరుపేదలుగా ఉన్న వారు.. రాత్రికిరాత్రే కోటీశ్వరులై పోతున్నారు. అలాగే, నల్లకోటీశ్వలు పేదలుగా మారిపోతున్నారు. తాజాగా అలాంటి సంఘటన ఒకటి పంజాబ్ రాష్ట్రంలో జరిగింది. ఓ టాక్సీ డ్రైవర్ ఖాతాలోకి ఏకంగా రూ.9806 కోట్లు జమ అయ్యాయి. ఈ వివరాలను పరిశీలిస్తే...
పేరు బల్వీందర్ సింగ్. ఓ టాక్సీ డ్రైవర్. పంజాబ్లో నివశిస్తున్నాడు. స్టేట్బ్యాంక్ ఆఫ్ పాటియాలాలో అతడికి ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద ఒక ఖాతా ఉంది. ఈనెల 4వ తేదీన ఉన్నట్టుండి అతడి ఖాతాలోకి దాదాపు 9806 కోట్ల రూపాయలు జమ అయ్యాయి. ఇంత స్థాయిలో తన ఖాతాలోకి డబ్బులు రావడం ఏంటని ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు.
తన మొబైల్ నంబరుకు వచ్చిన ఎస్ఎంఎస్ను పదే పదే చూసుకుని మురిసిపోయాడు. కానీ, అతడి సంతోషం గట్టిగా రెండు రోజులు కూడా ఉండలేదు. ఆ మొత్తం డబ్బంతా మర్నాడే ఖాతాలోంచి మాయమైపోయింది. అసలు ఆ డబ్బు ఎవరిది? ఎలా వచ్చింది? తన ఖాతాలోంచి తాను సంతకం పెట్టకుండా ఎలా వెళ్లిపోయిందనే విషయం అతనికి తెలియదు.
పెద్ద నోట్ల రద్దు తర్వాత ఎవరైనా నల్లధనాన్ని మార్చుకోడానికి వేసుకున్నారా అని కూడా అనుమానం వచ్చింది. ఇదే విషయం గురించి బ్యాంకు అధికారులను కూడా చాలాసార్లు అడిగాడు. కానీ ఫలితం లేదు. పైగా.. తన పాస్బుక్ను వాళ్లు నవంబర్ 7వ తేదీన తీసుకుని వాళ్ల దగ్గరే ఉంచుకున్నారని, తర్వాత కొత్త పాస్బుక్ ఇచ్చారు గానీ, అందులో ఈ 9806 కోట్ల రూపాయలకు సంబంధించిన ఎంట్రీ లేదని బల్వీందర్ చెపుతున్నాడు.
నిజానికి తన ఖాతాలో 3 వేల రూపాయలు ఉంటుందని, ఆ మొత్తం తనది కానే కాదని స్పష్టం చేశాడు. దీనిపై బ్యాంకు మేనేజర్ రవీందర్ కుమార్ను అడిగినా, వివరాలు ఏమీ చెప్పలేదు. ఆదాయపన్ను శాఖ అధికారులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారన్నారు.