Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యను వదిలించుకోవాలనుకున్నాడు.. కాలువలో కొట్టుకుపోయాడు..

భార్యను వదిలించుకోవాలనుకున్నాడు. కానీ సీన్ రివర్సైంది. చివరకు అతనే బలైపోయిన ఘటన పంజాబ్‌లోని ఫిరోజ్ పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, అన్వర్ మసీహ్ (29), కోమల్ (26) వివాహం 2010లో జరిగింది

Webdunia
శనివారం, 30 డిశెంబరు 2017 (08:34 IST)
భార్యను వదిలించుకోవాలనుకున్నాడు. కానీ సీన్ రివర్సైంది. చివరకు అతనే బలైపోయిన ఘటన పంజాబ్‌లోని ఫిరోజ్ పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, అన్వర్ మసీహ్ (29), కోమల్ (26) వివాహం 2010లో జరిగింది.

గత కొన్ని రోజుల నుంచి వీరిద్దరి మధ్య ఏర్పడిన గొడవలు.. వారిని దూరం చేశాయి. అంతే భార్యను చంపాలని అన్వర్ నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం పక్కా ప్లాన్ వేశాడు. 
 
తన తమ్ముడు నాచ్ తార్‌తో కలిసి బుధవారం సాయంత్రం గ్రామానికి సమీపంలో వున్న కాలువ వద్దకు చేరాడు. ఆ తర్వాత వారిద్దరూ కోమల్‌ను ఆ ప్రాంతానికి రప్పించి కాలువలోకి తోసేశారు. కానీ ఆమె అప్రమత్తం కావడంతో కాలువలో పడకుండా ఒడ్డున వున్న చెట్టును పట్టుకుంది. 
 
ఇంతలో ఆమెను నీటిలోకి లాగేందుకు అన్వర్ నీటిలోకి దిగాడు. అంతే సీన్ రివర్సైంది. ప్రమాదవశాత్తు అన్వర్ నీటిలో కొట్టుకుపోయాడు. అది చూసిన తమ్ముడు భయంతో అక్కడి నుంచి పారిపోయాడు. కోమల్ అరుపులు విన్న స్థానికులు అక్కడకు చేరుకుని, ఆమెను కాపాడారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments