Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యను వదిలించుకోవాలనుకున్నాడు.. కాలువలో కొట్టుకుపోయాడు..

భార్యను వదిలించుకోవాలనుకున్నాడు. కానీ సీన్ రివర్సైంది. చివరకు అతనే బలైపోయిన ఘటన పంజాబ్‌లోని ఫిరోజ్ పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, అన్వర్ మసీహ్ (29), కోమల్ (26) వివాహం 2010లో జరిగింది

Webdunia
శనివారం, 30 డిశెంబరు 2017 (08:34 IST)
భార్యను వదిలించుకోవాలనుకున్నాడు. కానీ సీన్ రివర్సైంది. చివరకు అతనే బలైపోయిన ఘటన పంజాబ్‌లోని ఫిరోజ్ పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, అన్వర్ మసీహ్ (29), కోమల్ (26) వివాహం 2010లో జరిగింది.

గత కొన్ని రోజుల నుంచి వీరిద్దరి మధ్య ఏర్పడిన గొడవలు.. వారిని దూరం చేశాయి. అంతే భార్యను చంపాలని అన్వర్ నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం పక్కా ప్లాన్ వేశాడు. 
 
తన తమ్ముడు నాచ్ తార్‌తో కలిసి బుధవారం సాయంత్రం గ్రామానికి సమీపంలో వున్న కాలువ వద్దకు చేరాడు. ఆ తర్వాత వారిద్దరూ కోమల్‌ను ఆ ప్రాంతానికి రప్పించి కాలువలోకి తోసేశారు. కానీ ఆమె అప్రమత్తం కావడంతో కాలువలో పడకుండా ఒడ్డున వున్న చెట్టును పట్టుకుంది. 
 
ఇంతలో ఆమెను నీటిలోకి లాగేందుకు అన్వర్ నీటిలోకి దిగాడు. అంతే సీన్ రివర్సైంది. ప్రమాదవశాత్తు అన్వర్ నీటిలో కొట్టుకుపోయాడు. అది చూసిన తమ్ముడు భయంతో అక్కడి నుంచి పారిపోయాడు. కోమల్ అరుపులు విన్న స్థానికులు అక్కడకు చేరుకుని, ఆమెను కాపాడారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ రియల్ రివ్యూ

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments