Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రగ్స్ స్మగ్లింగ్.. మనీ లాండరింగే కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు

Webdunia
గురువారం, 28 సెప్టెంబరు 2023 (16:40 IST)
పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సుక్పాల్ ఖైరా సింగ్‌‍ను పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్ స్మగ్లింగ్, మనీ లాండరింగ్ కేసులో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారం ఇపుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. గత 2015లో నమోదైన కేసు ఆధారంగా గురువారం ఉదయం ఆయన నివాసంలో సోదాలు చేసిన పోలీసులు.. ఆ తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యే సుక్పాల్ సింగ్‌ను అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించారు., 
 
ఈయనపై పోలీసులు పలు అభియోగాలు మోపుతున్నారు. డ్రగ్స్ స్మగ్లింగ్, మనీ లాండరింగ్, అంతర్జాతీయ స్మగ్లర్ల ముఠాగా అండదండలు అందించడం, వారికి ఆవాసం కల్పించడం, వారి నుంచి ఆర్థిక లబ్ధి పొందడం వంటి అనేక ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా స్మగ్లర్ల నుంచి తీసుకున్న డబ్బుతో ఆయన విలువైన ఆస్తులను కొనుగోలు చేశారని విచారణ సంస్థ అభియోగాలు మోపింది. 
 
గత 2014 నుంచి 2020 మధ్య కాలంలో సుక్పాల్ సింగ్ తన కోసం, తన కుటుంబం కోసం రూ.6.5 కోట్లకు పైగా ఖర్చు చేశారని, ఈ మొత్తం డిక్లరేషన్‌లో ఆయన పేర్కొన్న దాని కంటే ఎక్కువని పోలీసులు చెపుతున్నారు. మరోవైపు పోలీసులు తన ఇంటికి వచ్చి సోదాలు నిర్వహిస్తుండటాన్ని ఆయన ఫేస్‌బుక్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ చేశారు. ఈ వీడియోలో ఆయన పోలీసులతో వాగ్వాదం చేస్తున్నట్టు ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని.. ప్రతి రాత్రి బయటకు వెళ్లడం..?

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందిన ఫైటర్ శివ టీజర్ ఆవిష్కరించిన అశ్వనీదత్

ధర్మశాల వంటి ఒరిజనల్ లొకేషన్ లో పరదా చిత్రించాం : డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

Priyanka Arul : ఓజీ చిత్రం నుండి ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

తర్వాతి కథనం
Show comments