నేడు పంజాబ్ ముఖ్యమంత్రి వివాహం.. వధువు ఎవరంటే..!

Webdunia
గురువారం, 7 జులై 2022 (08:14 IST)
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ (48) వివాహం గురువారం జరుగనుంది. ఆయన వివాహం 32 యేళ్ల డాక్టర్ గురుప్రీత్ కౌర్‌తో చండీగఢ్‌లో జరుగుతుంది. నిజానికి ఈయనకు గతంలో వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆరేళ్ళ క్రితం ఆమెకు విడాకులు ఇచ్చారు. ప్రస్తుతం వీరంతా అమెరికాలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇపుడు డాక్టర్ గురుప్రీత్ సింగ్‌ను పెళ్లాడనున్నారు. 
 
ఈమె హర్యానాలోని పిహోవా ప్రాంత రైతు ఇందర్‌జిత్‌ సింగ్‌ కుమార్తె. మౌలానా వైద్య కళాశాలలో గోల్డ్‌ మెడలిస్ట్‌. రెండు కుటుంబాల మధ్య చాలా ఏళ్లుగా సాన్నిహిత్యం ఉంది. ఇటీవలి పంజాబ్‌ ఎన్నికల సమయంలోనూ ప్రచారంలో ఈమె మాన్‌కు సహకరించారు. ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లిగా సన్నిహిత వర్గాల సమాచారం.
 
చండీగఢ్‌ సెక్టార్‌ 8లోని ఓ గురుద్వారాలో అత్యంత నిరాడంబరంగా, అతికొద్దిమంది కుటుంబసభ్యుల సమక్షంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ సమన్వయకర్త అరవింద్‌ కేజ్రీవాల్‌ అతిథిగా హాజరు కానున్నారు. మార్చి 16న పంజాబ్‌ ముఖ్యమంత్రిగా భగవంత్‌ మాన్‌ ప్రమాణస్వీకారం చేసినపుడు ఆ వేడుకకు పిల్లలు సీరత్‌ (21), దిల్షాన్‌ (17) ఇద్దరూ హాజరయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments