Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీవీ చూడొద్దని తల్లి మందలించింది.. అంతే బాలుడు ఆత్మహత్య.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 10 జూన్ 2020 (16:42 IST)
watching TV
పాఠశాలలు సెలవులు, లాక్ డౌన్ కారణంగా పిల్లలు ఇంటి పట్టునే వుంటున్నారు. అయితే టీవీలకే అతుక్కుపోతున్నారు. అలా గంటల తరబడి టీవీ చూస్తున్నందుకు తల్లి మందలించిందనే కారణంతో ఆ బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణెలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. 14 ఏళ్ల బాలుడు రోజూ గంటల తరబడి టీవీలో కార్టూన్లు చూస్తున్నాడు. 
 
ఈ విషయంలో తల్లి ఎన్నిసార్లు మందలించినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. మంగళవారం టీవీ చూస్తున్న బాలుడిని కాస్త గట్టిగానే మందలించిన తల్లి...టీవీని ఆఫ్ చేసింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబీకులు బాలుడిని స్థానిక ఆస్పత్రికి తరలించినా...అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. 
 
దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. అతని కుటుంబ సభ్యులను విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. క్షణికావేశంతో బాలుడి ఆత్మహత్యకు పాల్పడ్డాడని వారు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments