టీవీ చూడొద్దని తల్లి మందలించింది.. అంతే బాలుడు ఆత్మహత్య.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 10 జూన్ 2020 (16:42 IST)
watching TV
పాఠశాలలు సెలవులు, లాక్ డౌన్ కారణంగా పిల్లలు ఇంటి పట్టునే వుంటున్నారు. అయితే టీవీలకే అతుక్కుపోతున్నారు. అలా గంటల తరబడి టీవీ చూస్తున్నందుకు తల్లి మందలించిందనే కారణంతో ఆ బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణెలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. 14 ఏళ్ల బాలుడు రోజూ గంటల తరబడి టీవీలో కార్టూన్లు చూస్తున్నాడు. 
 
ఈ విషయంలో తల్లి ఎన్నిసార్లు మందలించినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. మంగళవారం టీవీ చూస్తున్న బాలుడిని కాస్త గట్టిగానే మందలించిన తల్లి...టీవీని ఆఫ్ చేసింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబీకులు బాలుడిని స్థానిక ఆస్పత్రికి తరలించినా...అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. 
 
దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. అతని కుటుంబ సభ్యులను విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. క్షణికావేశంతో బాలుడి ఆత్మహత్యకు పాల్పడ్డాడని వారు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shiv Rajkumar: ఏపీ సీఎం చంద్రబాబు బయోపిక్‌‌లో నటించేందుకు సిద్ధం

Srinandu: పెళ్లి చూపులు అంత స్పెషల్ సినిమా సైక్ సిద్ధార్థ : సురేష్ బాబు

Catherine Tresa: సందీప్ కిషన్... అడ్వెంచర్ కామెడీ సిగ్మా లో కేథరీన్ థ్రెసా స్పెషల్ సాంగ్

నేను ఒక్కోసారి సినిమా రెమ్యూనరేషన్ కోల్పోతుంటా: పవన్ కల్యాణ్ పాత వీడియో

D. Suresh Babu: సినిమా వ్యాపారం వీధిలోకి వెళ్ళింది : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments