Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలు పట్టాలపై కూర్చొని పబ్ జీ ఆడిన ముగ్గురు మృతి.. ఎక్కడంటే?

సెల్వి
శుక్రవారం, 3 జనవరి 2025 (14:04 IST)
బీహార్‌లో రైలు పట్టాలపై కూర్చొని పబ్‌జీ ఆడటంలో నిమగ్నమైన ముగ్గురు యువకుల ప్రాణాలను బలిగొన్న విషాద ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. పశ్చిమ చంపారన్ జిల్లాలోని ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నరకాతియా గంజ్-ముజఫర్‌పూర్ రైల్వే సెక్షన్‌లోని మాన్సా తోలా ప్రాంతంలోని రాయల్ స్కూల్ సమీపంలో గురువారం ఈ ప్రమాదం జరిగింది.
 
బాధితులు గుమ్టికి చెందిన ఫుర్కాన్ ఆలం, మాన్సా తోలాకు చెందిన సమీర్ ఆలం- బారి తోలాకు చెందిన హబీబుల్లా అన్సారీ ఇయర్‌ఫోన్‌లు ధరించి రైలు వస్తున్నట్లు గుర్తించలేకపోయారు. వేగంగా వస్తున్న రైలు వారిపై నుంచి వెళ్లడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
 
ఈ ప్రమాదంతో స్థానికులు షాక్ అయ్యారు. రైల్వే ట్రాక్‌లపై మొబైల్ గేమ్‌లు ఆడడం వల్ల కలిగే ప్రమాదాలపై అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల గేమింగ్ అలవాట్లను పర్యవేక్షించాలని పోలీసులు కోరారు. బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పోలీసులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments