Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధానికి రక్తంతో లెటర్.. అన్యాయం జరిగితే నక్సల్స్‌లో చేరుతాం

Webdunia
మంగళవారం, 17 మే 2022 (15:47 IST)
ప్రధాని మోదీకి రక్తంతో లెటర్ అందింది. కర్ణాటకలో ఎస్సై పోస్టుల భర్తీలో అక్రమాలు జరుగుతున్నాయంటూ పలువురు అభ్యర్థులు ప్రధాని నరేంద్ర మోదీకి రక్తంతో ఉత్తరం రాశారు. 
 
రాష్ట్రంలో జరిగిన ఎస్సై పోస్టుల భర్తీలో అక్రమాలు జరిగాయని.. దీనిపై సమగ్రంగా విచారించాలని, అక్రమాలకు పాల్పడిని వారిని శిక్షించాలని అందులో డిమాండ్ చేశారు. 
 
అంతేకాదు.. ఉద్యోగాల్లో తమకు అన్యాయం జరిగితే నక్సల్స్‌ చేరుతామని కూడా ఆ లేఖలో హెచ్చరించారు. మొత్తం ఎనిమిది మంది లేఖ రాశామని అందులో పేర్కొన్నప్పటికీ, వారి పేర్లు కాని, పోన్ నెంబర్లు కానీ లేకుండా జాగ్రత్త పడ్డారు. 
 
అక్రమ మార్గంలో ఎస్సై పోస్టుకు ఎంపిక కావాలనుకున్న వారి వల్ల కష్టపడి చదివి, పరీక్షల్లో ఎంపికైన వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని చెప్పారు.
 
అయితే అభ్యర్థులకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూడాలని ఆ లేఖలో అభ్యర్థులు కోరారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై తమకు అపారమైన గౌరవం ఉందని, దీనిపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

GMB: మహేష్ బాబు నిర్మిస్తున్న రావు బహదూర్ చిత్రం నుంచి సత్య దేవ్ ఫస్ట్ లుక్

వామ్మో... 'దేవా' పాత్రధారికి అంత రెమ్యునరేషనా?

కూలీలో నటించిన రిచ్ కార్మికులు రజనీకాంత్, ఆమిర్ ఖాన్ పారితోషికం ఎంతో తెలుసా?

Hansika : విడాకుల దిశగా హన్సిక అడుగులు వేస్తుందా !

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments