Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంజీలు తీస్తానంటున్న ముఖ్యమంత్రి... ఎందుకో తెలుసా?

Webdunia
బుధవారం, 9 సెప్టెంబరు 2020 (16:37 IST)
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రజల ముందు వంద గుంజీలు తీస్తానంటోంది. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ఆమె ఈ తరహా వ్యాఖ్యలు ఎందుకు చేశారో ఓ సారి పరిశీలిద్ధాం. 
 
దేశ వ్యాప్తంగా త్వరలోనే దసరా శవన్నవరాత్రులు ప్రారంభంకానున్నాయి. అయితే, ఈ యేడాది కరోనా మహమ్మారి కారణంగా బెంగాల్ రాష్ట్రంలో దుర్గా పూజలకు అనుమతి లేదని, ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. 
 
దీనిపై మమతా బెనర్జీ ఘాటుగా స్పదించారు. ఈ యేడాది దుర్గా నవరాత్రులకు అనుమతి లేదని ప్రభుత్వం ప్రకటించిందని నిరూపిస్తే ప్రజల ముందు వంద గుంజీలు తీయడానికి సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు.
 
'దుర్గా పూజా విషయంలో రాజకీయ పార్టీ రకరకాలైన అవాస్తవాలను ప్రచారం చేస్తోంది. ఈ విషయంపై తాము ఎలాంటి సమావేశమూ పెట్టలేదు. ఈ యేడాది దుర్గా పూజను రద్దు చేస్తున్నట్లు తాము ప్రకటించామని నిరూపిస్తే ప్రజల ముందు వంద గుంజీలు తీయడానికి సిద్ధంగా ఉన్నాం' అని ఆమె ప్రకటించారు. 
 
ఈ విషయంలో సోషల్ మీడియా తప్పుడు వార్తలను ప్రచారం చేస్తోందని, ఇలా తప్పుడు వార్తలు ప్రచారం చేసే వారిని గుర్తించి, వంద గుంజీలు తీయించండని పోలీసులను సీఎం ఆదేశించారు. ఇలాంటి తప్పుడు ప్రచారంతో మత సహనం దెబ్బతింటోందని ఆమె మండిపడ్డారు. కాళీ, దుర్గా, హనుమాన్ పూజలు చేయని వారు కూడా పూజ గురించి మాట్లాడేస్తున్నారని సీఎం మమత మండిపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని.. ప్రతి రాత్రి బయటకు వెళ్లడం..?

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందిన ఫైటర్ శివ టీజర్ ఆవిష్కరించిన అశ్వనీదత్

ధర్మశాల వంటి ఒరిజనల్ లొకేషన్ లో పరదా చిత్రించాం : డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

Priyanka Arul : ఓజీ చిత్రం నుండి ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

తర్వాతి కథనం
Show comments