Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్ యాత్ర: అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ప్రియాంకా గాంధీ..

సెల్వి
శుక్రవారం, 16 ఫిబ్రవరి 2024 (19:38 IST)
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చేరారు. రాహుల్‌ తలపెట్టిన యాత్రలో పాల్గొనేందుకు ప్లాన్‌ చేస్తుండగా ప్రియాంక గాంధీ అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ఉత్తరప్రదేశ్‌లోని చందౌలీ జిల్లాలో శుక్రవారం జరిగే పార్టీ భారత్ జోడో న్యాయ్ యాత్రలో చేరడం లేదని చెప్పారు.
 
రాహుల్ గాంధీ నేతృత్వంలోని యాత్ర శుక్రవారం సాయంత్రం ఉత్తరప్రదేశ్‌లో ప్రవేశించింది. యాత్ర బీహార్ నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించిన తర్వాత ప్రియాంక ఉత్తరప్రదేశ్‌లోని చందౌలీలో తన సోదరుడితో చేరాల్సి ఉందని వర్గాలు తెలిపాయి.
 
అయితే ఆమె ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి వచ్చింది. మణిపూర్ నుంచి ముంబై వరకు భారత్ జోడో న్యాయ్ యాత్రకు రాహుల్ నాయకత్వం వహిస్తున్నారు. యాత్ర ప్రస్తుతం బీహార్ మీదుగా సాగుతోంది. ఫిబ్రవరి 16 నుంచి 21 వరకు, ఆ తర్వాత మళ్లీ ఫిబ్రవరి 24 నుంచి 25 వరకు ఈ యాత్ర రాష్ట్రంలో ప్రయాణిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

బడ్జెట్ రూ.40 కోట్లు.. కలెక్షన్లు రూ.210+ కోట్లు : 'మహవతార్ నరసింహా' ఉగ్రరూపం!!

నా కోసం ప్రభుత్వ వాహనం పంపలేదు... దానికి నాకూ ఎలాంటి సంబంధం లేదు : నిధి అగర్వాల్

ప్రభుత్వ వాహనంలో నిధి అగర్వాల్.. క్లారిటీ ఇచ్చిన హరిహర వీరమల్లు హీరోయిన్

Madhu Shalini : మధు శాలిని ప్రెజెంట్స్ కన్యా కుమారి రిలీజ్ కు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments