Webdunia - Bharat's app for daily news and videos

Install App

జేపీసీకి జమిలి బిల్లు... కమిటీలో ప్రియాంకా గాంధీ!!

ఠాగూర్
బుధవారం, 18 డిశెంబరు 2024 (16:35 IST)
'ఒకే దేశం - ఒకే ఎన్నిక' బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి కేంద్రం పంపించింది. ఈ బిల్లును అమల్లోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. కానీ, రాజ్యాంగ సవరణకు అనేక పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పైగా, జేపీసీకి పంపించాలంటూ విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో ఈ బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీకి (జేపీసీ) పంపించింది. ఈ బిల్లును పరిశీలించే జేపీసీ నామీనీ జాబితాలో కాంగ్రెస్‌ తరపున ఆ పార్టీ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ పేరు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 
 
ఈ కమిటీలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి మనీశ్‌ తివారీ, రణ్‌దీప్‌ సూర్జేవాలా, సుఖ్‌దేవ్‌ భగత్‌ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. అలాగే, సభ్యులుగా కల్యాణ్‌ బెనర్జీ, సాకేత్‌ గోఖలేల పేర్లను తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. కాగా.. దేశవ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించేందుకు అనువుగా 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఇటీవల లోక్‌సభలో ప్రవేశపెట్టింది. 
 
కాగా, మంగళవారం ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టగా 90 నిమిషాలపాటు చర్చ జరిగింది. ఆ తర్వాత ఓటింగ్‌ నిర్వహించారు. ఇందులో బిల్లుకు అనుకూలంగా 269 మంది.. వ్యతిరేకంగా 198 మంది ఓటేశారు. దీంతో బిల్లును ప్రవేశపెట్టడానికి స్పీకర్‌ ఓం బిర్లా ఆమోద ముద్ర వేశారు. 
 
అయితే.. ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమంటూ ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇది భారత రాజ్యాంగ మూల స్వరూపానికి భంగం కలిగించేలా ఉన్నందున జేపీసీకి పంపాలని డిమాండ్‌ చేశాయి. దీంతో ఈ బిల్లును జేపీసీకి పంపారు. ఈ కమిటీలో ప్రియాంక గాంధీ కూడా సభ్యురాలు కానున్నట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments