Webdunia - Bharat's app for daily news and videos

Install App

'అమ్మ' అంత్యక్రియల కోసం సాహసం చేసిన ప్రణబ్.. చెక్క బెంచీపై సీటు బెల్టు పెట్టుకుని ప్రయాణం!

రాష్ట్రపతి.. దేశాధిపతి. త్రివిధ దళాధిపతి. అలాంటి వ్యక్తి.. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అంత్యక్రియల కోసం పెను సాహసమే చేశారు. అదేంటో ఓసారి పరిశీలిద్ధాం. సోమవారం రాత్రి కన్నుమూసిన జయలలిత అంత్యక్రియలు మంగ

Webdunia
బుధవారం, 7 డిశెంబరు 2016 (16:13 IST)
రాష్ట్రపతి.. దేశాధిపతి. త్రివిధ దళాధిపతి. అలాంటి వ్యక్తి.. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అంత్యక్రియల కోసం పెను సాహసమే చేశారు. అదేంటో ఓసారి పరిశీలిద్ధాం. సోమవారం రాత్రి కన్నుమూసిన జయలలిత అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం మెరీనా తీరంలో జరిరగింది. ఈ అంత్యక్రియలకు ముందు జయలలిత పార్థివదేహాన్ని చెన్నైలోని రాజాజీ హాల్‌లో ఉంచారు. అక్కడకు వచ్చి జయలలిత భౌతికకాయానికి నివాళులు అర్పించేందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పెద్ద సాహసమే చేశారు. 
 
ఢిల్లీ నుంచి చెన్నైకు ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన లగ్జరీ ప్లేన్ బోయింగ్ 737లో చేరుకున్న ప్రణబ్‌.. అక్కడి నుంచి మెరీనా తీరానికి చేరుకునేందుకు ఎయిర్‌ఫోర్స్ వాళ్లు రవాణకు వినియోగించే ఎంఐ-17 హెలికాప్టర్‌ను ఎక్కాల్సి వచ్చింది. కాగా, ఈ హెలికాప్టర్‍లో బోయింగ్‌లాగా లగ్జరీ సీట్లు ఉండవు. దీంతో ప్రణబ్ ఓ బెంచ్‌పై సీట్ బెల్ట్ పెట్టుకొని ప్రయాణించారు. అంతకుముందు ఢిల్లీ నుంచి చెన్నై రావడానికి మొదట ప్రణబ్ బయలుదేరినా.. విమానంలో సాంకేతిక లోపం కారణంగా బయలుదేరిన కొద్దిసేపటికే మళ్లీ ఢిల్లీ వెళ్లిపోయారు.
 
ఇంజిన్‌లో తలెత్తిన సాంకేతిక లోపాన్ని సరిచేసిన కాసేపటి తర్వాత ప్రణబ్ మళ్లీ చెన్నై బయలుదేరారు. చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే.. ఆయనను మెరీనా బీచ్‌కు తీసుకెళ్లడానికి ఎంఐ-17 హెలికాప్టర్‌ను సిద్ధంగా ఉంచారు. రాష్ట్రపతి స్థాయి వ్యక్తి ప్రయాణించడానికి అంత అనువుగా లేకపోయినా.. ప్రణబ్ మాత్రం అప్పటికే ఆలస్యం కావడంతో అందులోనే మెరీనా తీరానికి చేరుకునేందుకు సాహసం చేశారు. దీంతో ఆయన జయలలిత అంత్యక్రియలకు ముందే హాజరయ్యారు. జయలలిత పార్థివదేహానికి నివాళుర్పించి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments