Webdunia - Bharat's app for daily news and videos

Install App

#AtalBihariVajpayee 95వ జయంతి.. నివాళులు అర్పించిన ప్రధాని

Webdunia
బుధవారం, 25 డిశెంబరు 2019 (12:40 IST)
భారత మాజీ ప్రధాని అటల్‌ బీహారీ వాజ్ పేయి 95వ జయంతి సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోడీ నివాళులర్పించారు. డిసెంబర్ 25న ఉదయం రాష్ట్రపతి రామ్‌నాథ్‌, ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, హోంశాఖ మంత్రి అమిత్‌ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో పాటు పలువురు కేంద్ర మంత్రులు.. ఢిల్లీలోని అటల్‌ సమాధి వద్దకు చేరుకుని అక్కడ పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు.
 
అలాగే ఈ దేశ ప్రజలు వాజ్ పేయికి ఘనంగా స్మరించుకుంటూ నివాళి అర్పిస్తున్నారని ప్రధాన మంత్రి మోదీ ట్వీట్ చేశారు. వాజ్ పేయి చేసిన ప్రసంగాల తాలూకు మాంటేజీని కూడా అయన జత చేశారు. దివంగత ప్రధాని పేరిట మోదీ ప్రభుత్వం వివిధ ప్రజాసంక్షేమ పథకాలను చేబట్టింది. 
 
గ్రౌండ్ వాటర్ మేనేజ్ మెంట్‌ని మెరుగుపరచేందుకు ''అటల్ భూజల్ యోజన'' పేరిట రూ. 6 వేల కోట్ల పథకాన్ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. అలాగే రోహ తాంగ్ కనుమ కింద కీలకమైన టన్నెల్‌కు వాజ్‌పేయి పేరు పెట్టాలని కూడా ప్రభుత్వం ప్రతిపాదించింది.
 
కృష్ణదేవి, కృష్ణ బిహారీ వాజ్ పేయి దంపతులకు వాజ్ పేయి 1924 డిసెంబరు 25న జన్మించారు. 1939లో ఆర్ఎస్ఎస్‌లో చేరారు. 1942‌లో క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో తన సోదరుడితో సహా ఆయన అరెస్టయ్యారు. ఆ సమయంలోనే భారతీయ జన సంఘ్‌కు నేతృత్వం వహించవలసిందిగా ఆర్‌ఎస్‌ఎస్ ఆయనను కోరింది.

1962లో 37 ఏళ్ళ వయస్సులో ఆయన రాజ్యసభ సభ్యుడయ్యారు. అనంతరం లోక్‌సభ సభ్యుడై ఆ సభకు తొమ్మిది సార్లు ఎన్నికవుతూ వచ్చారు. 1996లో 13 రోజులు, 1998 లో 13 నెలలు, 1999 నుంచి ఐదేళ్లు ఆయన ప్రధానిగా వ్యవహరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అశ్విన్ పులిహార బాగా కలుపుతాడు - వెండితెర పై క్రికెటర్ కూడా : థమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments