Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చిన ప్రశాంత్ కిషోర్.. ఏంటది?

Webdunia
మంగళవారం, 26 ఏప్రియల్ 2022 (16:19 IST)
జాతీయ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వందేళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి గట్టి షాకిచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదంటూ స్పష్టం చేశారు. వచ్చే 2024లో జరిగే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తుంది. ఇందుకోసం ప్రశాంత్ కిషోర్ సలహాలు, సూచనలను తీసుకుంటుంది. 
 
అదేసమయంలో ప్రశాంత్ కిషోర్‌ను పార్టీలో చేరాల్సిందిగా పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్వయంగా ఆహ్వానించారని, అందువల్ల ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు ప్రచారం జరిగింది. ఈ ఊహాగానాలకు ఊతమిచ్చేలా కాంగ్రెస్ అధినేత్రి సోనియాతో ప్రశాంత్ కిషోర్ వరుస భేటీలు నిర్వహించారు. దీంతో ఆయన పార్టీలో చేరడం ఖాయమంటూ వార్తలు వచ్చాయి.
 
ఈ నేపథ్యంలో తాను కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదంటూ పీకే స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రశాంత్ కిషోర్ తిరస్కరించారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్ సూర్జేవాలా వెల్లడించారు. నిర్ధిష్టమైన బాధ్యతలతో పార్టీ చేరాలని స్వయంగా సోనియా ప్రతిపాదించినప్పటికీ అందుకు ప్రశాంత్ కిషోర్ నిర్ద్వంద్వంగా తిరస్కరించారని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments