Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ లోకంలో పేరుమోసిన 'ఈవ్‌ టీజర్' శ్రీకృష్ణుడే.. ప్రశాంత్ భూషణ్ వివాదాస్పద ట్వీట్స్

ఆమ్ ఆద్మీ పార్టీ నేత ప్రశాంత్ భూషణ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలను వేధించే వారి భరతం పట్టేందుకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సర్కారు ఏర్పాటు చేసిన యాంటీ రోమియో స్క్వాడ్‌లపై ఆ

Webdunia
సోమవారం, 3 ఏప్రియల్ 2017 (08:41 IST)
ఆమ్ ఆద్మీ పార్టీ నేత ప్రశాంత్ భూషణ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలను వేధించే వారి భరతం పట్టేందుకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సర్కారు ఏర్పాటు చేసిన యాంటీ రోమియో స్క్వాడ్‌లపై ఆయన స్పందించారు. "రోమియో కేవలం ఒక్క అమ్మాయినే ప్రేమించాడు. మరోవైపు కృష్ణుడు పేరుమోసిన ఈవ్‌ టీజర్‌ (అమ్మాయిలను ఏడిపించేవాడు). ఈ లెక్కన యోగి ఆదిత్యనాథ్‌కు తన యాంటీ రోమియో స్క్వాడ్స్‌ను యాంటీ కృష్ణా స్క్వాడ్స్‌ అనే దమ్ముందా?" అంటూ ట్వీట్‌ చేశారు. 
 
ఇంతటితో ఆయన ఆగలేదు. హిందూ పురాణాల్లో కొందరు దేవుళ్లు ‘ఈవ్‌ టీజర్స్‌’ అయినా కూడా వారిని దేవుళ్లుగా కొలుస్తున్నారని పేర్కొన్నారు. దీంతో ఆయనపై దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. వెంటనే ప్రశాంత్ భూషణ్‌ తన ట్వీట్‌ను సమర్థించుకుంటూ.. 'రోమియో బ్రిగేడ్‌ మీద నా ట్వీట్‌ను వక్రీకరించారు. నా ఉద్దేశం ఏంటంటే.. ఏ లాజిక్‌తో అయితే రోమియో బ్రిగేడ్‌ను పెట్టారో, దాని ప్రకారం కృష్ణుడు కూడా ఈవ్‌ టీజరే అవుతాడు కదా' అంటూ మరో ట్వీట్‌ చేశారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments